తల్లికి తలకొరివి పెట్టిన కూతురు | daughter did her mother funerals | Sakshi
Sakshi News home page

తల్లికి తలకొరివి పెట్టిన కూతురు

Feb 10 2018 4:42 PM | Updated on Feb 10 2018 4:42 PM

daughter did her mother funerals - Sakshi

తల్లి అంతిమయాత్రలో కూతురు..

దుబ్బాక : తల్లికి కూతురు తలకొరివి పెట్టిన సంఘటన దుబ్బాక మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పట్టణ కేంద్రానికి చెందిన తాటిపల్లి శకుంతల(62) గుండెపోటుతో గురువారం సాయంత్రం మరణించింది. నిరుపేద కుటుంబానికి చెందిన శకుంతలకు కుమారులు లేకపోవడంతో ముగ్గురు కూతుళ్లలో చిన్న కూతురైన ఉమామహేశ్వరి అన్నీ తానై తలకొరివి పెట్టింది. శకుంతల భర్త బాల్‌ నర్సయ్య అంధుడు. దీంతో కూతురితో తలకొరివి పెట్టించారు. గ్రామస్తులు చందాలు వేసుకుని దహన సంస్కారాలు నిర్వహించారు. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement