
ఇబోలా బాధితుడికి చికిత్స చేసిన నర్సుకూ వ్యాధి
ఇబోలా పేరు చెబితేనే అమెరికా వణికిపోతోంది. అగ్రరాజ్యంలోనే మొట్టమొదటి ఇబోలా రోగికి చికిత్స చేసిన టెక్సాస్ ఆస్పత్రి నర్సుకు కూడా ఇప్పుడు ఆ వ్యాధి సోకింది.
ఇబోలా పేరు చెబితేనే అమెరికా వణికిపోతోంది. అగ్రరాజ్యంలోనే మొట్టమొదటి ఇబోలా రోగికి చికిత్స చేసిన టెక్సాస్ ఆస్పత్రి నర్సుకు కూడా ఇప్పుడు ఆ వ్యాధి సోకింది. అత్యంత ప్రమాదకరమైన ఈ వ్యాధి గురించిన పరీక్షలు చేయగా, ఆమె పాజిటివ్ అని తేలింది. ఆమెకు చికిత్స విషయంపై మాత్రం ఆస్పత్రి, రోగి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆమెకు శుక్రవారం రాత్రి కొద్దిగా జ్వరం వచ్చింది. ఆ తర్వాత పరీక్షలు చేయగా, అసలు విషయం తేలింది. అమెరికాలో ఈ వైరస్ సోకిన తొలి రోగి థామస్ ఎరిక్ డంకన్ ఇప్పటికే మరణించాడు.
దీంతో ఇప్పుడు అమెరికా గుండెల్లో గుబులు పట్టుకుంది. ఈ విషయమై ఆస్పత్రి డైరెక్టర్ టాప్ ఫ్రీడెన్ తెలిపారు. ఇబోలా సోకిన డంకన్ వద్దకు ఆ నర్సు చాలాసార్లు వెళ్లి, దగ్గర నుంచి పరీక్షించిందని ఆయన చెప్పారు. సాధారణంగా ఇబోలా రోగుల విషయంలో ఒక ప్రోటోకాల్ పాటిస్తామని, కొన్నిసార్లు దాన్ని ఉల్లంఘించడంతో ఇలా వ్యాపిస్తుందని ఆయన తెలిపారు. లైబీరియాకు చెందిన 42 ఏళ్ల డంకన్ సెప్టెంబర్ 20వ తేదీన డల్లస్ వచ్చారు. చాలా రోజుల తర్వాత అనారోగ్యం పాలయ్యారు. చివరకు ప్రాణాలు కోల్పోయారు.