
ఒక్కరోజు అక్కడ సోషల్ మీడియా బంద్!
ఎన్నికలు జరుగుతున్న రోజు సోషల్ నెట్ వర్కింట్ సైట్లను బ్యాన్ చేయనున్నట్లు ఉగాండా నిర్ణయించుకుంది.
కంపాలా: ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఈ రోజు సోషల్ నెట్ వర్కింట్ సైట్లను బ్యాన్ చేయనున్నట్లు ఉగాండా నిర్ణయించుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియాపై ఆ ఒక్క రోజు ఆంక్షలు తప్పవని ఉగాండా ప్రభుత్వం పేర్కొంటుంది. ప్రస్తుత అధ్యక్షుడు యోవేరి మస్వేనీని ఐదోసారి అధికారపీఠం వరించనుందో లేదో అన్నదానిపై దేశ ప్రజలు చర్చించుకుంటున్నారు. గత 30 ఏళ్లుగా ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 1986 నుంచి యోవేరి మస్వేనీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గత ఎన్నికలు (2011) సమయంలో కూడా ఇలాంటి నిషేధాన్ని అమలుచేశారు. 2006లోనే అధ్యక్ష పదవి పోటీకి అతడు అనర్హుడు కావాలి కానీ, అధ్యక్ష పదవికి ఎన్నిసార్లు అయినా పోటీచేయవచ్చునని 2005లో చేసిన రాజ్యాంగ సవరణతో బయటపడ్డారు.
మొబైల్ మనీ ట్రాన్స్ఫర్ సేవలకు కూడా ఎలక్షన్ రోజు కోత పడనున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రచారంలోనూ అసత్య ప్రచారం బాగా వ్యాపించిన కారణంగా ప్రస్తుత ఎన్నకల్లో ఆ ప్రభావం తగ్గించడానికి, ఓటింట్ జరిగే రోజు పుకార్లు వ్యాపించనున్న నేపథ్యంలో సోషల్ మీడియాపై ఆంక్షలవైపే ఆ ప్రభుత్వం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ముబైల్ సర్వీసులు, సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడం.. భావవ్యక్తీకరణ హక్కును హరించినట్లేనని ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ డిప్యూటీ రీజనల్ డైరెక్టర్ సారా జాక్సన్ అభిప్రాయపడ్డారు.