ప్లైట్స్‌లో ఎలక్ట్రానిక్స్‌ రవాణాపై అమెరికా నిషేధం

ప్లైట్స్‌లో ఎలక్ట్రానిక్స్‌ రవాణాపై అమెరికా నిషేధం - Sakshi

విమానంలోని క్యాబిన్‌లో ఎలక్ట్రానిక్స్‌ వస్తువులను తీసుకెళ్లడంపై అమెరికా నిషేధం విధించింది. మిడిల్‌ ఈస్ట్‌, ఆఫ్రికా దేశాల నుంచి అమెరికాకు వెళ్లే విమానాల్లో ఈ నిషిద్ధ ఆంక్షలు అమలులో ఉంటాయని అమెరికా అధికారులు పేర్కొన్నారు. సైజులో స్మార్ట్‌ఫోన్‌ కంటే పెద్దగా ఉండే వస్తువులను (ఉదాహరణ: ఐప్యాడ్‌, కిండిల్‌, ల్యాప్‌టాప్‌) విమాన క్యాబిన్‌లోకి తీసుకెళ్లడం ఇక కుదరదని తెలిపారు.

 

టెర్రరిస్టులు ఎలక్ట్రానిక్‌ వస్తువుల ద్వారా పేలుడు పదార్ధాలను అమెరికాకు తీసుకువస్తున్నారనే భద్రతా కారణాలతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాగా, ఈ నిర్ణయంతో మిడిల్‌ఈస్ట్‌, ఆఫ్రికాల నుంచి భారీ సంఖ్యలో అమెరికాకు సర్వీసులు నడుపుతున్న దిగ్గజ ఎయిర్‌లైన్‌ సంస్ధలు ఎమిరేట్స్‌, ఖతార్‌, టర్కీష్‌ తదితర సంస్ధలు ఇబ్బందులు పడనున్నాయి.

 

ఈ రూట్లలో ఒక్క అమెరికన్‌ ఎయిర్‌లైన్‌ సంస్ధ సర్వీసులు నడుపుతూ లేకపోవడం గమనార్హం. నిషేధానికి ఇంత కాలపరిమితి ఏమీ లేదని అధికారులు తెలిపారు. కొత్త నిబంధనలను అమెరికాకు సర్వీసులు నడిపే సంస్ధలు వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top