సాధారణంగా ఎవరైనా వాహనాలు నడుపుతూ సరైన పత్రాలు లేక పట్టుబడితే వారికి రవాణాశాఖ మంత్రులు ఏం చెబుతారో అందరికీ తెలుసు. డ్రైవింగ్ చేసేవాళ్లతో తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని, ఇన్సూరెన్స్ తో పాటు ఇతర పత్రాలు లేకపోతే ఇబ్బందులు తప్పవని సలహాలిస్తారు. అయితే స్కాట్లాండ్లో రవాణాశాఖ మంత్రి హుంజా యూసఫ్ కు చేదు అనుభవం ఎదురైంది. ట్రాఫిక్ పోలీసుల తనిఖీలలో భాగంగా మంత్రి నడుపుతున్న కారును ఆపి చెక్ చేశారు. దీంతో ఆయన వద్ద ఇన్సూరెన్స్, ఇతర పత్రాలు సరైనవి కావని తేలింది. అక్కడి ట్రాఫిక్ చట్టాల ప్రకారం ఇతరుల వాహనాలు నడపాలంటే అందుకు తగిన పర్మిషన్ లెటర్, కొన్ని పత్రాలు డ్రైవింగ్ చేసే వ్యక్తి వద్ద తప్పనిసరిగా ఉండాలి.
గత వారం(డిసెంబర్ 2న) డింగ్ వాల్ సమీపంలో స్కాట్లాండ్ పోలీసులు రాత్రి 7 గంటల సమయంలో తనిఖీలు చేయగా a835 అనే నంబర్ ఉన్న కారును మంత్రి యూసఫ్ నడుపుతున్నారు. మంత్రి కారును ఆపి తనిఖీ చేయగా ఆయన వద్ద ఆ కారు నడిపేందుకు సరైన పత్రాలు లేవని తేలింది. ఈ విషయంపై మీడియా ఆయనను ప్రశ్నించగా.. తన వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, అందుకే తాను వాహనాన్ని డ్రైవ్ చేశానని చెప్పుకొచ్చారు. ఇతరుల వాహనాలు నడిపేందుకు కావలసిన అన్ని విషయాలు తనకు తెలుసునని చెప్పారు. చివరికి విచారణలో ఆయన ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ ప్రాసెస్ పూర్తికాలేదని తేలింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించిన ఫైన్ మొత్తాన్ని చెల్లించారు. ఇన్సూరెన్స్ కవరేజ్ లో పూర్తి సమాచారం అప్ డేట్స్ చేసుకుంటానని మంత్రి యూసఫ్ వివరించారు.
కారు చెకింగ్.. రవాణా మంత్రికి చేదు అనుభవం!
Published Wed, Dec 7 2016 5:38 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
తప్పక చదవండి
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement