ఖషోగ్గీ కేసులో ఐదుగురికి మరణశిక్ష | Saudi Court Sentences 5 to Death in Khashoggi Murder | Sakshi
Sakshi News home page

ఖషోగ్గీ కేసులో ఐదుగురికి మరణశిక్ష

Dec 24 2019 2:18 AM | Updated on Dec 24 2019 10:32 AM

Saudi Court Sentences 5 to Death in Khashoggi Murder - Sakshi

రియాద్‌: వాషింగ్టన్‌ పోస్ట్‌ జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీ హత్య కేసులో ఐదుగురికి మరణ శిక్ష విధిస్తూ సౌదీ అరేబియా కోర్టు తీర్పుని చ్చింది. విచారణను ఎదుర్కొన్న ఇద్దరు ఉన్నతస్థాయి వ్యక్తులను నిర్దోషులుగా ప్రకటించింది. సౌదీ అరేబియా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ షలాన్‌ అల్‌ షలాన్‌ సోమ వారం ఈ విషయాలు తెలిపారు. నేరాన్ని కప్పి ఉంచేందుకు యత్నించారన్న ఆరోపణ లపై ఈ కేసులో మరో ముగ్గురికి 24 ఏళ్ల జైలు శిక్ష విధించారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తెలిపారు. ఈ కేసులో 11 మంది విచారణను ఎదు ర్కోగా ఐదుగురికి మరణశిక్ష, ముగ్గురికి జైలు విధించగా మిగిలిన వారు నిర్దోషులుగా విడుదలయ్యారు. యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ బద్ధ వ్యతిరేకి అయిన ఖషోగ్గీ గత ఏడాది అక్టోబర్‌ 2న ఇస్తాంబుల్‌ (టర్కీ)లోని సౌదీ ఎంబసీలో హత్యకు గురయ్యారు. దౌత్య కార్యాలయ అధికారులు ముందు హత్యను నిరాకరిం చినా.. ఘర్షణలో అతడు మరణించినట్లు తర్వాత ఒప్పుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement