వైద్యం చేయించుకోవడానికి విదేశాలకు వెళ్లేందుకు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు ఆ దేశ ప్రభుత్వం అనుమతిచ్చింది.
కరాచీ: వైద్యం చేయించుకోవడానికి విదేశాలకు వెళ్లేందుకు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు ఆ దేశ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆదేశాలు అందుకున్న వెంటనే ఆయన వెన్నెముకకు చికిత్స చేయించుకోవడానికి దుబాయ్కు చేరుకున్నారు. తానో యుద్ధ యోధుడినని, తన జన్మభూమికి త్వరలోనే తిరిగి వెళతానని ఈ సందర్భంగా ముషారఫ్ చెప్పారు.
పాక్ తిరిగి వెళ్లిన తర్వాత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానన్నారు. ముషారఫ్ దుబాయ్ వెళ్లడానికి గురువారం సాయంత్రం పాక్ ప్రభుత్వం అనుమతిచ్చింది. రాజద్రోహంతో పాటు చాలా కేసుల్లో ఆయన విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.