పాక్ నుంచి 350 మంది భారత జాలర్లకు విముక్తి | Pakistan Court greensignal to Release Of 350 Indian Fishermen | Sakshi
Sakshi News home page

పాక్ నుంచి 350 మంది భారత జాలర్లకు విముక్తి

May 24 2017 7:43 PM | Updated on Sep 5 2017 11:54 AM

పాక్ నుంచి 350 మంది భారత జాలర్లకు విముక్తి

పాక్ నుంచి 350 మంది భారత జాలర్లకు విముక్తి

పాక్ చెర నుంచి భారత జాలర్లకు విముక్తిఅక్రమంగా పాక్‌ జలాల్లోకి ప్రవేశించి జైలు పాలైన 350 మంది భారత జాలర్లను విడుదల చేయాలంటూ ఇస్లామాబాద్ కోర్టు తీర్పిచ్చింది.

ఇస్లామాబాద్‌: అక్రమంగా పాక్‌ జలాల్లోకి ప్రవేశించి జైలు పాలైన 350 మంది భారత జాలర్లను విడుదల చేయాలంటూ ఇస్లామాబాద్ కోర్టు తీర్పిచ్చింది. జ్యూడీషియల్‌ మెజిస్ట్రేట్‌ మాలిర్‌ సల్మాన్‌ అంజిద్‌ సిద్ధిఖీ ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీచేశారు. భారత జాలర్లు ఇప్పటికే 8 నెలల జైలు శిక్ష అనుభవించారని,  వారు చేసిన నేరానికి ఆ శిక్ష సరిపోతుందన్నారు. వెంటనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆ శాఖ అధికారులకు సూచించారు.

ఇరుదేశాలకు చెందిన జాలర్లు పొరపాటున పొరుగుదేశ జలాల్లోకి ప్రవేశించి అరెస్ట్‌ కావడం గత కొంతకాలం నుంచి చర్చనీయాంశమైంది. అరేబియా సముద్రంలో ఏ దేశానికి ఎంతమేరకు జలసరిహద్దు ఉందో కచ్చితమైన సమాచారం లేకపోవడంతోనే వందల సంఖ్యలో జాలర్లు ఇలా పొరుగు దేశంలో జైలు పాలు కావాల్సి వస్తుందని పాక్ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement