♦ చైనాయే లక్ష్యంగా క్షిపణిని అభివృద్ధి చేస్తున్న భారత్
♦ అణ్వాయుధ సంపత్తి మెరుగుదిశగా ముందుకు
♦ డ్రాగన్ ఆటకట్టించే రీతిలో తయారీ
♦ 200 వార్హెడ్లకు సరిపడా ప్లుటోనియం సిద్ధం
♦ వెల్లడించిన వాషింగ్టన్ పత్రిక
వాషింగ్టన్/న్యూఢిల్లీ: చీటికిమాటికి సరిహద్దుల వద్ద వివాదాలు సృష్టిస్తూ మన భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్న చైనా ఆటకట్టించే దిశగా భారత్ ముందుకు సాగుతోంది. ఇందులోభాగంగా అణ్వాయుధాలను ఆధునీకరిస్తోంది. వాస్తవానికి ఇప్పటిదాకా పాకిస్థాన్నే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న భారత్ ఇప్పుడు కమ్యూనిస్టు దిగ్గజం అంతుచూడాలని భావిస్తున్నట్టు అమెరికాకు చెందిన అణురంగ నిపుణులు పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలోని తన స్థావరం నుంచి ప్రయోగిస్తే చైనా భస్మీపటలం అయ్యేస్థాయి కలిగిన క్షిపణిని భారత్ తయారుచేస్తోందని జూలై–ఆగస్టు మధ్యకాలంలో ప్రచురించిన ఓ వ్యాసంలో అమెరికాకు చెందిన డిజిటల్ జర్నల్ పేర్కొంది.
150 నుంచి దాదాపు 200 వార్హెడ్లకు సరిపడా ప్లుటోనియంను భారత్ సిద్ధం చేసిందని, అయితే 120 నుంచి 130 వార్హెడ్లను మాత్రమే తయారుచేస్తుందని సదరు వ్యాసం పేర్కొంది. సిక్కిం సరిహద్దు వివాదంతో భారత్–చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. డోక్లాం ప్రాంతం నుంచి భారత బలగాలు వెనక్కి వెళ్లాలంటూ చైనా హెచ్చరిస్తున్నా భారత్ వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఇరు దేశాల మధ్య దాదాపు యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత అణు శక్తిపై ప్రముఖ అమెరికన్ అణ్వాయుధ నిపుణులు రాసిన కథనం ఆసక్తికరంగా మారింది.
అమెరికాకు చెందిన హన్స్ ఎం క్రిస్టెన్సన్, రాబర్ట్ ఎస్ నోరిస్ అనే ఇద్దరు అణ్వాయుధ నిపుణులు.. ‘ఇండియన్ న్యూక్లియర్ ఫోర్స్ 2017’ పేరుతో కథనం రాశారు. ఇందులో భారత అణు శక్తిని గురించి ప్రస్తావించారు. భారత్ తన అణ్వాయుధ సంపత్తిని ఆధునీకరిస్తోందని.. చైనా మొత్తాన్ని టార్గెట్ చేసేంత క్షిపణులను తయారుచేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం భారత్ వద్ద ఏడు అణు సామర్థ్య వ్యవస్థలు ఉన్నాయి. అందులో రెండు ఎయిర్క్రాఫ్ట్లు, నాలుగు భూ ఉపరితల ఖండాంతర క్షిపణులు, ఒకటి సముద్ర ఉపరితల ఖండాంతర క్షిపణి. అయితే ప్రస్తుతం మరో నాలుగు వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. రానున్న దశాబ్ద కాలంలో వీటిని సిద్ధం చేయనుంది. ఇక అగ్ని–1ను ఆధునీకరించి అగ్ని–2ని తయారుచేసింది.
రెండు వేల కి.మీ ప్రయాణించగల సామర్థ్యం దీనికి ఉంది. దీంతో చైనాలోని పశ్చిమ, దక్షిణ, మధ్య భూభాగాలను లక్ష్యంగా చేసుకోవచ్చు. ఇక అగ్ని–4ను భారత్లోని ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రయోగిస్తే.. చైనా మొత్తాన్ని టార్గెట్ చేయవచ్చు. లాంగ్ రేంజ్ అగ్ని–5ని కూడా భారత్ అభివృద్ధి చేస్తోంది. ఐదు వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించగల సామర్థ్యం ఉన్న ఈ ఖండాంతర క్షిపణిని దక్షిణాది నుంచి ప్రయోగించినా. చైనా మొత్తాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చు’ అని క్రిస్టెన్సన్, నోరీస్ తమ వ్యాసంలో పేర్కొన్నారు.
నేడు అఖిలపక్ష సమావేశం
చైనా వివాదంపై వివరణ ఇవ్వనున్న కేంద్రం
చైనాతో సరిహద్దు వివాదంతోపాటు కశ్మీర్లో తాజా పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం కేంద్రం...అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో పాల్గొనే అన్ని పార్టీల నాయకులకు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రభుత్వ వైఖరిని వివరించనున్నారు. ఈ ప్రతిపక్ష నేతలతోపాటు ఇద్దరు సీనియర్ మంత్రులు కూడా హాజరవనున్నారు. ఈ సందర్భంగా ఈ రెండు అంశాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని వివరించనున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవనున్న నేపథ్యంలో ఈ రెండు అంశాల విషయంలో అధికార, విపక్షాలు ఏకతాటిపైకి రావాలని కేంద్రం భావిస్తోంది.
కాగా ఇండియా–భూటాన్–టిబెట్ ట్రైజంక్షన్వద్ద సిక్కిం పరిధిలోగల డోక్లాంవద్ద యథాపూర్వకస్థితిని మార్చేందుకు చైనా యత్నిస్తుండడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. గత మూడువారాలుగా డోక్లాం విషయమై ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు అమర్నాథ్ యాత్ర ముగించుకుని తిరిగివస్తున్న భక్తులపై జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు దాడులు జరపడం. ఏడుగురు యాత్రికులు చనిపోవడం తెలిసిందే. ఈ రెండు అంశాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నాయి.
విడిచిపెడితే చైనా వినాశనమే
Published Thu, Jul 13 2017 10:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి
SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
Sakshi News Cartoon: మన సారే! ఈ మధ్య మరీ దిగజారి మాట్లాడుతున్నారుగా!
KITEX Group: ‘ట్వంటీ20 పార్టీ.. తప్పుడు నిర్ణయాలతోనే ఇబ్బంది’
చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు
Sanjeeda Sheikh: చీరలో అదరగొడుతున్న హీరోయిన్ లుక్స్ (ఫోటోలు)
చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్
కట్టప్పతో స్టార్ హీరో.. ఈ మధ్యే రూ.150 కోట్ల హిట్ మూవీతో..!
30 వేల కోట్ల ఆరోపణలపై పెద్దిరెడ్డి క్లారిటీ..!
మా అక్కలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలబడతా: వైఎస్ అవినాష్
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement