ప్రపంచ దేశాల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ.. ఉత్తర కొరియా ఇటీవల హైడ్రోజన్ బాంబును పరీక్షించిన సంగతి తెలిసిందే. హైడ్రోజన్ బాంబు పరీక్ష సందర్భంగా సమీపంలోని ఓ సొరంగం కుప్పకూలి.. 200 మంది చనిపోయినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర కొరియా ఈశాన్య ప్రాంతమైన పంగ్యే-రీ ప్రాంతంలో గత నెల కిమ్ జాంగ్ ఉన్ సర్కారు హైడ్రోజన్ అణుబాంబు పరీక్షించింది. కొరియా చేపట్టిన ఆరో అణ్వాయుధ పరీక్షల్లో భాగంగా సెప్టెంబర్ 3న దాదాపు వందకిలోల హైడ్రోజన్ బాంబ్ను పేల్చింది. అత్యంత శక్తిమంతమైన ఈ పేలుడు ధాటికి ఆ దేశం పెద్ద మూల్యమే చెల్లించుకుంది. పేలుడు ధాటికి పరీక్ష జరిగిన ప్రాంతమంతా తీవ్ర ప్రభావానికి లోనై.. సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం కుప్పకూలిందని జపాన్కు చెందిన ఆసహి టీవీ చానెల్ తెలిపింది.
ఈ ప్రమాదంలో సొరంగం నిర్మాణంలో పాలుపంచుకుంటున్న వందమంది కార్మికులు చనిపోయారని మొదట భావించారని, కానీ, సహాయక చర్యలు ముగిసిన తర్వాత మృతుల సంఖ్య 200కు చేరుకుందని తేలిందని కొరియా వర్గాలను ఉటంకిస్తూ ఆ చానెల్ వెల్లడించింది. 1945లో హిరోషిమాపై అమెరికా వేసిన అణుబాంబు కంటే ఏడురెట్లు పెద్దదైన ఈ హైడ్రోజన్ బాంబు పరీక్ష వల్ల అక్కడి భూభాగం మెత్తబడి ఈ ప్రమాదం చోటుచేసుకొని ఉంటుందని భావిస్తున్నారని ఆ చానెల్ పేర్కొంది. అత్యంత శక్తివంతమైన ఈ హైడ్రోజన్ బాంబు పేలుడుతో ఆ ప్రాంతంలోని పర్వతం అడుగుభాగంలో 60 నుంచి 100 మీటర్ల అగ్నిగుండం ఏర్పడిందని కొరియా వాతావరణశాఖ ఇప్పటికే వెల్లడించింది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మరిన్ని అణుబాంబు పరీక్షలు నిర్వహిస్తే.. వాతావరణంలోకి రేడియోధార్మిక కణాలు లీక్ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
షాకింగ్: 'అణు' పేలుడు.. 200 మంది మృతి!
Published Tue, Oct 31 2017 5:56 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement