పాకిస్థాన్లో సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 15 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 15 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్లోని ఉత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశారు.
యుద్ధ విమానాల సాయంతో పాక్ బలగాలు దాడులు నిర్వహించాయి. దాడుల్లో మరణించిన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందినవారన్న విషయం ఇంకా తెలియరాలేదు.