
బస్తీలకు కొత్త సొబగులు
‘బస్తీలలో ఉన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోగలిగాను.
‘బస్తీలలో ఉన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోగలిగాను. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తా. మంత్రులు, ముఖ్యమంత్రికి ఈ ప్రాంత ప్రజల కష్టాలను వివరిస్తాను. బస్తీల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా.
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తా’నంటూ మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని బస్తీవాసులకు హామీ ఇచ్చారు. ‘సాక్షి’ వినూత్నంగా చేపట్టిన ‘వీఐపీ రిపోర్టర్’ కార్యక్రమంలో భాగంగా ఆయన గురువారం ఆ బస్తీలో పర్యటించారు. స్థానికులతో మమేకమై, సమస్యలు తెలుసుకున్నారు.