రోడ్డు ప్రమాదం లో టీఆర్‌ఎస్‌ నేత మృతి | TRS leader died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం లో టీఆర్‌ఎస్‌ నేత మృతి

Mar 28 2017 2:24 AM | Updated on Aug 30 2018 4:10 PM

రోడ్డు ప్రమాదం లో టీఆర్‌ఎస్‌ నేత మృతి - Sakshi

రోడ్డు ప్రమాదం లో టీఆర్‌ఎస్‌ నేత మృతి

రోడ్డు ప్రమాదంలో టీఆర్‌ఎస్‌ నేత మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం నల్లగొండ

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

ఏఎస్‌రావునగర్‌: రోడ్డు ప్రమాదంలో టీఆర్‌ఎస్‌ నేత మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ బృందావన్‌ కాలనీ ఉపాధ్యక్షుడు ఆనంద్‌రెడ్డి(50). మద్యం మానేయాలనే ఉద్దేశంతో తన స్నేహితులతో కలిసి సోమవారం నల్లగొండ జిల్లాకు వెళ్లాడు. విరుగుడు మందు తీసుకుని తిరిగివస్తుండగా మాల్‌ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన తుఫాన్‌ వాహనం ఢీ కొనడంతో డ్రైవింగ్‌ చేస్తేన్న ఆనంద్‌ రెడ్డి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనలో కారులో ఉన్న చంద్రశేఖర్, రాజశేఖర్‌ రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి జిల్లా చాడ గ్రామానికి చెందిన ఆనంద్‌ రెడ్డి చాలాకాలంగా నగరంలో స్థిర పడ్డాడు. మల్లాపూర్‌ కార్పొరేటర్‌ పన్నాల దేవేందర్‌రెడ్డికి ఈయన సమీప బంధువు. పన్నాల దేవేందర్‌రెడ్డి, ఏఎస్‌రావునగర్‌ కార్పొరేటర్‌ పజ్జూరి పావనీరెడ్డిలతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు ఆనంద్‌రెడ్డి నివాసానికి వచ్చి కుటుంబసభ్యులను ఓదార్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement