రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజోవత్
నాంపల్లి : ఎన్నికల మ్యానిఫెస్టోలో టీఆర్ఎస్ పేదల సంక్షేమానికి పెద్ద పీట వేసిందని, ఈ పథకాల అమలుకు రూ.12 లక్షల కోట్లు ఖర్చవుతుందని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజోవత్ అన్నారు. శనివారం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో తెలంగాణ దళిత హక్కుల చైతన్య యాత్ర ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యానిఫెస్టోలోని పొందుపరిచిన పథకాలను అమలు చేస్తున్నా, వాటిని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.
వీటిని సక్రమంగా అమలు చేసే బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని, అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. దళితుల అవసరాలపై పోరాటాలు చేపట్టి సాధించుకోవాలన్నారు. ఉభయ పార్లమెంట్ సభల్లో 184 మంది దళితులు సభ్యులుగా ఉన్నారని, వారు ఏకమైతే సభలను స్తంభింపజేయవచ్చన్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో టికెట్లు రావనే భయంతో ఉన్నారని, నాకు కాకుంటే మన జాతిలోనే మరొకరికి వస్తుందనే భావన రావాలన్నారు. రాష్ట్రంలో దళితులు ఏకమైతే 55 అసెంబ్లీ సీట్లు సాధించుకోవచ్చునన్నారు.
పైసలకు, సారాకు లొంగకుండా సరైన అభ్యర్థికి ఓటు వేస్తే చేతులు చాచి అడుక్కోవాల్సిన అవసరం ఉండదన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పెషల్ ఆఫీసర్ ఆర్.సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, రాష్ట్ర దళిత సేన అధ్యక్షులు జేబి రాజు, నాయకులు ఆనందరావు, ప్రొఫెసర్ ఎంఎన్ భూషి, మోహన్ రావు, చంద్రయ్య, బోస్, దుర్గం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమానికి పెద్ద పీట
Published Sun, Aug 16 2015 4:52 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
పకడ్బందీగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
పనులు వేగంగా చేయిస్తున్నాం: కలెక్టర్
ఆత్మ ఘోష..!
స్ట్రాంగ్రూమ్ల వద్ద మూడంచెల భద్రత
ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీ సీట్లు గెలుస్తాం
దేవుడి భూమిని క్రీడా మైదానంగా మార్చే యత్నం
రామన్పాడులో 1,010 అడుగులు
వెళ్దామంటే దారులు లేవు
ప్రైవేట్ క్లినిక్లలో తనిఖీలు
తప్పక చదవండి
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- జీ ఎంటర్టైన్మెంట్ లాభం రూ. 13 కోట్లు
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- Delhi Chief Minister Arvind Kejriwal: భారత్లో ‘రష్యా’ పరిస్థితులు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం మార్కెట్ ఆధునీకరణ
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
Advertisement