- చంద్రబాబు అసమర్ధత వల్లే రాష్ట్రానికి అన్యాయం
- వైఎస్సార్సీపీ నేత వాసిరెడ్డి పద్మ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. టీడీపీ సర్కార్ దోపిడీని ప్రశ్నిస్తే జర్నలిస్టులను సైతం బెదిరిస్తున్నారని విమర్శించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణా జలాల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా మీనమేషాలు లెక్కిస్తూ రైతులకు బాబు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. స్విస్ చాలెంజ్పై కోర్టులో వాదనలు వినిపించడానికి ఢిల్లీ నుంచి ఆగమేఘాల మీద అటార్నీ జనరల్ను పిలిపిస్తారు కానీ.. రాష్ట్ర ప్రజలకు న్యాయంగా రావాల్సిన నీటి వాటాపై కేంద్రంపై ఒత్తిడి మాత్రం తీసుకురారని విమర్శించారు.
టీడీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతోనే దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.స్విస్ చాలెంజ్పె హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే హడావుడిగా ఎందుకు ఏపీఐడీఈ చట్టాన్ని సవరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. డెవలపర్ వాటాలకు సంబంధించి వివరాలు చెప్పాల్సి వస్తుందనే చట్టాల్ని మారుస్తూ ఆర్డినెన్స్ ఇచ్చారని, బహిరంగంగా దోపిడీ చేయటానికి తెగబడ్డారని అన్నారు.
రాష్ట్రంలో నియంత పాలన
Published Tue, Oct 25 2016 1:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement