హైదరాబాద్ : డ్రగ్స్ మాఫియా కేసులో మూడోరోజు సిట్ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్న సుబ్బరాజు విచారణ నిమిత్తం ఇవాళ ఉదయం (శుక్రవారం) అబ్కారీ కార్యాలయానికి వచ్చారు. ఆయనను సిట్ అధికారులు సుమారు ఎనిమిది గంటలకు పైగా విచారణ జరుపుతున్నారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్తో గల సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీశారు. తమ దగ్గర ఉన్న సాక్ష్యాలను చూపించి ఆయనపై సిట్ అధికారులు ప్రశ్నలు వర్షం కురిపించారు.
ఓ దశలో సుబ్బరాజు విచారణ ముగిసిందని వార్తలు వెలువడ్డా... మరికొన్ని గంటల పాటు సుబ్బరాజు ప్రశ్నిస్తామని ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. కొద్దిసేపు బ్రేక్ ఇచ్చామని, అనంతరం విచారణ కొనసాగుతుందన్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 70 పబ్లకు నోటీసులు ఇచ్చామని, రేపు పబ్లు, బార్ల యజమానులతో సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. తమ అదుపులో ఉన్న పలువురు పబ్లో డ్రగ్స్ అమ్ముతున్నట్లు సమాచారం ఇచ్చారని, 16 పబ్ల్లో డ్రగ్స్ అమ్ముతున్నారని వాళ్లు వెల్లడించారన్నారు. రేపు నటుడు తరుణ్ను విచారణ చేస్తామని పేర్కొన్నారు. అలాగే ఈ నెల 27న ముమైత్ ఖాన్ విచారణకు పిలిచామన్నారు. విచారణ పూర్తయిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు.
అంతకు ముందు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ మాట్లాడుతూ సుబ్బరాజు విచారణకు సహకరిస్తున్నారని తెలిపారు. సుబ్బరాజును ప్రశ్నిస్తుంటే కీలక విషయాలు బయటపడుతున్నాయని, ఇవాళ కీలక విషయాలు తెలుస్తాయని భావిస్తున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ అభిప్రాయపడ్డారు. డ్రగ్స్ కేసులో లోతుగా విచారణ చేయాల్సి ఉందని, ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఆ వివరాల గురించి విచారణ అనంతరం వెల్లడిస్తామన్నారు. డ్రగ్స్ మాఫియాతో టాలీవుడ్ లింకులపై ఆధారాలు లభిస్తున్నాయని, అలాగే నోటీసులు అందుకున్న ముమైత్ఖాన్, ఛార్మీ కూడా విచారణకు హాజరు అవుతారని ఆయన తెలిపారు.
మరోవైపు సుబ్బరాజు రక్తనమునా సేకరణ కోసం ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. సిట్ అధికారులు వరుసగా నోటీసులు ఇచ్చినవారిని విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యాం కె నాయుడును విచారణ చేశారు. శనివారం నటుడు తరుణ్ సిట్ ఎదుట హాజరు అవుతారు.
కీలక విషయాలు వెల్లడించిన సుబ్బరాజు!
Published Fri, Jul 21 2017 6:43 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఓ మదీ మేలుకో..!
‘ఎన్నికల సమయంలో డ్యూటీ పీరియడ్గా పరిగణించాలి’
స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన ఎస్పీ
లూజు పెట్రోల్ విక్రయించరాదు
24న ఎచ్చెర్ల ఐటీఐలో జాబ్ మేళా
మల్లేష్కు కన్నీటి వీడ్కోలు
తగ్గని ఎన్నికల వేడి
మహేంద్రతనయలో పడి యువకుడి మృతి
ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షకు 97 మంది గైర్హాజరు
ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
తప్పక చదవండి
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement