ఆ విగ్రహాలను తొలగిస్తే హైదరాబాద్కు విఘాతం | Sakshi
Sakshi News home page

ఆ విగ్రహాలను తొలగిస్తే హైదరాబాద్కు విఘాతం

Published Mon, Sep 29 2014 12:26 PM

ఆ విగ్రహాలను తొలగిస్తే హైదరాబాద్కు విఘాతం - Sakshi

హైదరాబాద్ : ట్యాంక్బండ్పై సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలు అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనటం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి శంకర్రావు అభిప్రాయపడ్డారు. ఉన్న విగ్రహాలను తొలగించకుండా తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఆయన సోమవారమిక్కడ అన్నారు. సీమాంద్ర విగ్రహాలను తొలగిస్తే హైదరాబాద్కు విఘాతం జరుగుతుందని శంకర్రావు వ్యాఖ్యానించారు. తెలుగువారి మధ్య ఐక్యత లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు మాట్లాడేవారు మధ్య విద్వేషాలు మంచిది కాదని శంక్రరావు అన్నారు.

 

Advertisement
Advertisement