'కోదండరామ్ ఎవరికీ లొంగే వ్యక్తి కాదు' | sakshi editorial director k ramachandra murthy speaks in prof.kodandaram rythu deeksha | Sakshi
Sakshi News home page

'కోదండరామ్ ఎవరికీ లొంగే వ్యక్తి కాదు'

Oct 23 2016 2:57 PM | Updated on Jul 29 2019 2:51 PM

'కోదండరామ్ ఎవరికీ లొంగే వ్యక్తి కాదు' - Sakshi

'కోదండరామ్ ఎవరికీ లొంగే వ్యక్తి కాదు'

ప్రొ.కోదండరామ్ ఎవరికీ లొంగిపోయే వ్యక్తి కాదని కె.రామచంద్రమూర్తి అన్నారు.

హైదరాబాద్ : రైతు సమస్యలను పరిష్కరించడం సీఎం కేసీఆర్కు పెద్ద ఇబ్బందే కాదని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. రైతు సమస్యలపై ప్రొ.కోదండరామ్ ఆదివారం ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన రైతు దీక్షలో ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ సమగ్ర వ్యవసాయ విధానం రూపొందిస్తారనుకున్నాం...కానీ అలా జరగలేదన్నారు. 
 
గతంలో చాలా మంది రైతు నాయకులు ప్రభుత్వాలకు లొంగిపోయారన్నారు. కానీ కోదండరామ్ ఎవరికీ లొంగిపోయే వ్యక్తి కాదని రామచంద్రమూర్తి చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement