రూ. 40 లక్షలతో పట్టుబడ్డ వ్యక్తి | Rs.40 lakhs seized in nampally railway station | Sakshi
Sakshi News home page

రూ. 40 లక్షలతో పట్టుబడ్డ వ్యక్తి

Mar 31 2015 1:53 PM | Updated on Sep 2 2017 11:38 PM

రూ. 40 లక్షలతో పట్టుబడ్డ వ్యక్తి

రూ. 40 లక్షలతో పట్టుబడ్డ వ్యక్తి

నగరంలోని నాంపల్లి రైల్వే స్టేషన్లో పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్: నగరంలోని నాంపల్లి రైల్వే స్టేషన్లో పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఓ వ్యక్తి నుంచి ఆధారాలు లేకుండా తీసుకుపోతున్న రూ. 40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నగదుతోపాటు అతడిని పక్కనే ఉన్న రైల్వే పోలీసు స్టేషన్కు తరలించారు.

కూకట్పల్లి నుంచి శబరి ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు సదరు వ్యక్తి నాంపల్లి రైల్వే స్టేషన్కు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం శబరి ఎక్స్ప్రెస్లో అక్రమంగా తరలిస్తున్న వెండిని పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లో తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement