తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపక్షాలను బలహీనం చేసే చర్యలను ఎలా చేస్తారని ప్రశ్నించింది.
న్యూఢిల్లీ: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపక్షాలను బలహీనం చేసే చర్యలను ఎలా చేస్తారని ప్రశ్నించింది. ఇలాంటి చర్యలను అడ్డుకోకుండా స్పీకర్ ఎలా ఉంటున్నారని అడిగినట్లు కూడా సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ఈ పిటిషన్ వేయగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు స్పీకర్, ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.
మూడు వారాల్లోగా తమకు వివరణ ఇవ్వాలని సుప్రీం వారికి సూచించింది. గతంలో ఇదే పిటిషన్ హైకోర్టులో వేయగా కోర్టు విచారణకు స్వీకరించకపోవడంతో ఆయన సుప్రీకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై సంపత్ తరుపున జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపించారు.