'దొరల పెత్తనానికి' నిరసనగా టీఆర్ఎస్లోకి చేరా | Nomula Narsimhaiah takes on Congress and Telugu desam party | Sakshi
Sakshi News home page

'దొరల పెత్తనానికి' నిరసనగా టీఆర్ఎస్లోకి చేరా

Apr 8 2014 12:49 PM | Updated on Mar 18 2019 7:55 PM

'దొరల పెత్తనానికి' నిరసనగా టీఆర్ఎస్లోకి చేరా - Sakshi

'దొరల పెత్తనానికి' నిరసనగా టీఆర్ఎస్లోకి చేరా

నల్గొండలో దొరల పెత్తనానికి నిరసనగానే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు సీపీఎం మాజీ నేత నోముల నర్శింహయ్య వెల్లడించారు.

నల్గొండలో దొరల పెత్తనానికి నిరసనగానే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు సీపీఎం మాజీ నేత నోముల నర్శింహయ్య వెల్లడించారు. నోముల నర్సింహయ్య శనివారం హైదరాబాద్లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ కోసం సీపీఎంలో ఉంటూనే పోరాటం చేసినట్లు ఆయన గుర్తు చేశారు.

 

తెలంగాణ ప్రాంతానికి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే ద్రోహం చేశాయంటూ ఆ రెండు పార్టీలపై నోముల నిప్పులు చెరిగారు. నోములతోపాటు కొడంగల్ కాంగ్రెస్ నేత గుర్నాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరారు.

 

Advertisement
 
Advertisement
Advertisement