మావోయిస్టుల అదుపునకు కేంద్రం కొత్త పాలసీ
సాక్షి, హైదరాబాద్: నిషేధిత సీపీఐ(మావోయిస్టు) పార్టీ కార్య కలాపాలపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త విధానంతో ఉక్కు పాదం మోపనుంది. దీనికి సంబంధించి తెలంగాణతో సహా పది మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల డీజీపీల నుంచి సూచనలను, ఈ విధానం ఎలా ఉండాలనే విషయమై అభిప్రాయాలను కేంద్ర హోంమంత్రిత్వశాఖ సేకరించింది.
ఢిల్లీలో బుధవారం జరిగిన మావోల ప్రభావిత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్,పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ డీజీపీల సమావేశంలో కొత్త పాలసీని తీసుకు రావాలని నిర్ణయించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులకు గిరిజనుల మద్దతు లభించడానికి ప్రధాన కారణం ఆ ప్రాంతాలు అభివృద్ధికి సుదూరంగా ఉండటమేనని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్శర్మతో సహా పలు రాష్ట్రాల డీజీపీలు పేర్కొన్నారు.
కనీసం సౌకర్యాల లేమి, వివిధ ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలు వారికి చేరక పోవడం వంటి కారణాలు కూడా కారణమవుతున్నాయని డీజీపీలు వివరించారని తెలిసింది. ఒక పక్క అభివృద్ధి మరో పక్క ఆపరేషన్స్ విధానంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో మావోయిస్టుల కార్యకలాపాలకు చెక్ పెట్టగలిగామని ఇరు రాష్ట్రాల డీజీపీలు అనురాగ్శర్మ, జేవీ రాముడు పేర్కొన్నారు. నిరంతర నిఘా, నల్లమల అటవీ ప్రాంతంలో తరచూ గాలింపు చర్యలు చేపట్టడంవల్ల ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు.
దండకారణ్యం పరిధిలో ఉన్న మావోల ప్రభావిత రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మరింతగా పెంచినప్పుడే వారికి దీటైన జవాబు చెప్పగలమని రాష్ట్ర డీజీపీ శర్మ సూచించారు. ఈ సమస్యను జాతీయ సమస్యగా పరిగణించాలనే సూచనను కేంద్ర హోంశాఖ వ్యతిరేకించినట్లు తెలిసింది. అవసరమైన కేంద్ర బలగాలను సంబంధిత రాష్ట్రాలకు పంపుతామని చెప్పింది. వివిధ రాష్ట్రాల డీజీపీల నుంచి అందిన సూచనలు, నివేదికలను పరిశీలించి వచ్చే పది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త విధాన నిర్ణయాన్ని ప్రకటించనుందని అధికార వర్గాలు తెలిపాయి.
కొత్త విధానంతో దూకుడు
Published Fri, Dec 12 2014 2:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement