మంగళసూత్రం తెంపుకెళ్లారు | managalasutra robbed | Sakshi
Sakshi News home page

మంగళసూత్రం తెంపుకెళ్లారు

Feb 4 2015 10:18 PM | Updated on Aug 30 2018 5:27 PM

హైదరాబాద్ నగరంలో.. మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకుని ఇంటికి వెళుతున్న ఓ మహిళ మెడలోంచి గుర్తు తెలియని దుండగులు 3 తులాల బంగారు మంగళ సూత్రాన్ని తెంపుకెళ్లారు.

లంగర్‌హౌస్(హైరదాబాద్): హైదరాబాద్ నగరంలో.. మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకుని ఇంటికి వెళుతున్న ఓ మహిళ మెడలోంచి గుర్తు తెలియని దుండగులు 3 తులాల బంగారు మంగళ సూత్రాన్ని తెంపుకెళ్లారు. ఈ సంఘటన నగరంలోని లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిదిలో బుధవారం మధ్యాహ్నం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీ అండ్ టీ కాలనీలో నివాసముండే స్వప్న(22) సప్తగిరి కాలనీలో ఓ ఇంట్లో పనిచేస్తూ.. కూరగాయలు తెచ్చేందుకు బుధవారం మధ్యాహ్నం గుడిమల్కాపూర్ మార్కెట్‌కు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఆమె సప్తగిరి కాలనీకి చేరుకోగానే ఎదురుగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని మంగళసూత్రాన్ని తెంపుకొని పారిపోయారు. మూడు తులాల మంగళసూత్రాన్ని దుండగులు తెంపుకెళ్లారని, పుస్తెలు తెగి కింద పడ్డాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement