
అమ్మాయిల ఫోటోలు తీస్తూ బుక్కయ్యాడు
సెల్ఫోన్లో అమ్మాయిల ఫోటోలు తీస్తూ రెడ్హ్యాండెడ్గా చిక్కాడో ఆకతాయి. దీంతో ఆ ఆకతాయికి అందరూ కలిసి దేహశుద్ధి చేశారు
హైదరాబాద్ : సెల్ఫోన్లో అమ్మాయిల ఫోటోలు తీస్తూ రెడ్హ్యాండెడ్గా చిక్కాడో ఆకతాయి. దీంతో ఆ ఆకతాయికి అందరూ కలిసి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన శనివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు దిగి వస్తున్నఓ మహిళా ప్రయాణికురాలిని ఓ వ్యక్తి తన ఫోన్లో ఫోటో తీశాడు. ఈ విషయాన్ని గమనించిన ఆమె తన ఫోటో ఎందుకు తీశావంటూ అతడితో వాగ్వివాదానికి దిగింది. అయితే అతగాడు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఈ విషయాన్ని గమనించిన సహ ప్రయాణికులు ఆ వ్యక్తిని నిలదీసినా ఫలితం లేకపోయింది.
అతడి వద్ద ఉన్న సెల్ఫోన్ తీసుకుని చూడగా అందులో చాలామంది అమ్మాయిలు ఫోటోలు ఉన్నాయి. రైల్వేస్టేషన్కి వచ్చే అందమైన యువతల ఫోటోలను అతగాడు ఫోన్లో చిత్రీకరించటాన్ని గమనించిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చితకబాదారు. అనంతరం పోలీసులుకు సమాచారం అందించారు. వారు అతగాడిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల అమ్మాయిల ఫోటోలు తీసి వాటిని దుర్వినియోగం చేయటం పరిపాటిగా మారుతున్న విషయం తెలిసిందే.