ముందు సంపన్నుల ఇళ్లు కూల్చండి: బీజేపీ | Krishna Sagar Rao Comments on TRS government | Sakshi
Sakshi News home page

ముందు సంపన్నుల ఇళ్లు కూల్చండి: బీజేపీ

Sep 30 2016 1:55 AM | Updated on Mar 29 2019 9:31 PM

ముందు సంపన్నుల ఇళ్లు కూల్చండి: బీజేపీ - Sakshi

ముందు సంపన్నుల ఇళ్లు కూల్చండి: బీజేపీ

టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే చేతలకు ఏమాత్రం పొంతన లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు విమర్శించారు.

సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే చేతలకు ఏమాత్రం పొంతన లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు విమర్శించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు చేపట్టిన నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో ముందుగా సంపన్నులు కబ్జా చేసుకున్న వాటిని కూల్చాలన్నారు. ఆ తర్వాతే పేదల జోలికి వెళ్లాలని సూచించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాలాలపై అక్రమ నిర్మాణాలను కూల్చాలని 2015లోనే కోర్టు ఆదేశిస్తే.. ఇప్పుడు కూల్చడమేమిటన్నారు. ప్రభుత్వ పట్టాలిచ్చిన వారి ఇళ్లు కూల్చాలంటే పరిహారమివ్వాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement