కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరగనుంది.
మొత్తం 8 అంశాలపై బోర్డులో చర్చించనుండగా ప్రధాన చర్చ కొత్తప్రాజెక్టులు, ఈ ఏడాదికి వర్కింగ్ మాన్యువల్, నీటి పంపిణీ, చిన్న నీటి వనరుల కింద నీటి వినియోగంపైనే ఉండనుంది. ముఖ్యంగా ఏపీ చేపట్టిన ఆయా ప్రాజెక్టుల నీటి వినియోగంపై తెలంగాణ ప్రశ్నించనుంది. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు దక్కాల్సిన వాటాలపైనా నిలదీయనుంది. రాష్ట్రానికి చెందిన పాలమూరు, డిండి, భక్తరామదాస ప్రాజెక్టులు కొత్తగా చేపట్టినవి కావని స్పష్టం చేయనుంది.