పార్టీ ఫిరాయింపులతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం | janacaitanya platform President V. Lakshmana Reddy fired on Defectionars | Sakshi
Sakshi News home page

పార్టీ ఫిరాయింపులతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం

Jul 21 2016 4:10 AM | Updated on Sep 4 2017 5:29 AM

పార్టీ ఫిరాయింపులతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం

పార్టీ ఫిరాయింపులతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం

జనం ఓటుతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి నిదర్శనమని జనచైతన్య వేదిక....

జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి. లక్ష్మణ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జనం ఓటుతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి నిదర్శనమని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి. లక్ష్మణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్ సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో పలు సంఘాల నేతలతో కలసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయడంతో పాటు తదుపరి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిబంధన విధించాలన్నారు.

ఈ అధికారం ఎన్నికల కమిషన్‌కు ఇచ్చేలా రాజ్యాంగ సవరణ చేపట్టాలన్నారు. స్పీకర్లు అధికార పార్టీలకు ఏజెంట్లుగా మారి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారన్నారు. స్పీకర్ల నిర్ణయాలపై న్యాయ స్థానాలకు వెళ్లే అవకాశం పార్టీలకు ఉండాలని డిమాండ్ చేశారు. ఈ నెల 31న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘పార్టీ ఫిరాయింపులు-ప్రమాదంలో ప్రజాస్వామ్యం’పై రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సెమినార్‌లో ప్రముఖ న్యాయ కోవిధులు జస్టిస్ బి. జీవన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు ఎస్. జైపాల్ రెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి ప్రసంగిస్తారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement