breaking news
V. Lakshmana Reddy
-
పార్టీ ఫిరాయింపులతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం
జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి. లక్ష్మణ రెడ్డి సాక్షి, హైదరాబాద్: జనం ఓటుతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి నిదర్శనమని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి. లక్ష్మణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్ సోమాజీగూడలోని ప్రెస్క్లబ్లో పలు సంఘాల నేతలతో కలసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయడంతో పాటు తదుపరి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిబంధన విధించాలన్నారు. ఈ అధికారం ఎన్నికల కమిషన్కు ఇచ్చేలా రాజ్యాంగ సవరణ చేపట్టాలన్నారు. స్పీకర్లు అధికార పార్టీలకు ఏజెంట్లుగా మారి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారన్నారు. స్పీకర్ల నిర్ణయాలపై న్యాయ స్థానాలకు వెళ్లే అవకాశం పార్టీలకు ఉండాలని డిమాండ్ చేశారు. ఈ నెల 31న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘పార్టీ ఫిరాయింపులు-ప్రమాదంలో ప్రజాస్వామ్యం’పై రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సెమినార్లో ప్రముఖ న్యాయ కోవిధులు జస్టిస్ బి. జీవన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు ఎస్. జైపాల్ రెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి ప్రసంగిస్తారన్నారు. -
భూ సమీకరణపై అఖిలపక్షంతో చర్చించాలి
వాస్తు కోసమో, మూఢ నమ్మకాల కోసమో రాజధాని నిర్మాణం సరికాదు హేతుబద్ధత లేకుండా వ్యవహరిస్తే సింగూర్ తరహా ఉద్యమాలు ‘ఏపీ రాజధాని-భూ సమీకరణ’పై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ భేటీలో డిమాండ్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి భూ సమీకరణపై అఖిలపక్షంతో చర్చించకుండా, రైతుల్లో అపోహలు తొలగించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్లడం సరికాదని పలు రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు అన్నారు. రాష్ట్ర పరిస్థితులు, వనరులు, బడ్జెట్ను దృష్టిలో ఉంచుకుని వాస్తవ దృక్పథంతో ముందుకెళ్లాలన్నారు. వాస్తు కోసమో, మూఢ నమ్మకాల కోసమో రాజధానిని నిర్మిస్తామనడం క్షంతవ్యం కాదన్నారు. బ్లూ ప్రింట్ సమర్పించి కేంద్ర సాయాన్ని కోరకుండా ప్రభుత్వ పెద్దలు సింగపూర్, జపాన్ పర్యటనలు చేపట్టటాన్ని వక్తలు తప్పుపట్టారు. హేతుబద్ధత లేకుండా అశాస్త్రీయమైన విధానంలో భూ సమీకరణ చేపడితే సింగూర్ భూముల తరహా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.ఆంధ్రప్రదేశ్ ‘రాజధాని- భూ సమీకరణ’పై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి దీనికి అధ్యక్షత వహించగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. రైతులకనుకూలంగానే సుప్రీం తీర్పులు... ఏపీ రాజధాని ఎలా ఉండాలనే అంశంపై శివరామకృష్ణన్ కమిటీని నియమించినప్పుడు కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని జస్టిస్ లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. నదీ జలాల చెంత నిర్మాణాలు జరపరాదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మొండిగా నదీ ముఖ రాజధాని అనటం సరికాదన్నారు. కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే కుట్ర రాజధానికి భూ సమీకరణపై రైతుల్లో పలు అభిప్రాయాలున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. పారిశ్రామికవేత్తలను పెట్టుబడుల కోసం ఆహ్వానించేందుకే జపాన్, సింగపూర్ పర్యటనలని సీఎం చంద్రబాబు చెబుతున్నా.. ల్యాండ్పూలింగ్లో రైతుల నుంచి సేకరించిన భూముల్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేడానికేన్న అనుమానం వ్యక్తం చేశారు. సొంత ఇంటి నిర్మాణం కాదు: వాసిరెడ్డి భూ సమీకరణ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం రైతులకు శుష్క వాగ్దానాలు చేస్తోందని వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణం అంటే సొంత ఇంటి నిర్మాణం కాదన్నారు. వేల ఎకరాలు ఎక్కడా తీసుకోలేదు: కాంగ్రెస్ 28 రాష్ట్రాల్లో ఏ రాజధాని నిర్మాణానికి ఇన్ని వేల ఎకరాలు సేకరించలేదని, అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ విస్తీర్ణమే 25.9 చదరపు కిలోమీటర్లని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.తులసిరెడ్డి పేర్కొన్నారు. ఇవ్వకుంటే ‘గ్రీన్బెల్ట్’ కిందకే! సమీకరణకు అంగీకరించని రైతులను బలవం తం చేయరని, ఆ భూముల్ని గ్రీన్బెల్ట్ పరిధిలో తెచ్చే యోచన చేస్తున్నట్లు రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి విజయకుమార్ చెప్పారు. భూ సమీకరణపై రైతుల అభిప్రాయం తెలుసుకునేందుకు వెళ్ళిన పది వామపక్ష పార్టీలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం హేయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. ఏపీ కాంగ్రెస్ దళిత విభాగం అధ్యక్షులు కొరివి వినయ్కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు రాజధర్మం పాటించకుండా సామాజిక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. భూ సమీకరణలో వ్యాపార నీతిని ప్రదర్శిస్తే తీవ్ర ప్రతిఘటన ఎదురు కాకతప్పదని రాజకీయ సామాజిక విశ్లేషకులు టి.లక్ష్మీనారాయణ హెచ్చరించారు. -
విచ్ఛిన్నమైన రోజు ఆవిర్భావ దినమా!
ఖండించిన జన చైతన్య వేదిక సాక్షి, హైదరాబాద్: తెలుగు జాతి విచ్ఛిన్నమైన రోజును ఏపీ రాష్ట్ర అవతరణ దినంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని జన చైతన్య వేదిక ఖండించింది. ఆదివారం ఎన్ఎస్ఎస్లో జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు, పంచాయితీరాజ్ ఉద్యోగుల నేతలతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తుంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా 1956 నవంబర్ 1న తొలి రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ నవంబర్ 1నే అవతరణ దినంగా జరుపుకోవాలని డిమాండ్ చేశారు. జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి, విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి చేగొండి రామజోగయ్య మాట్లాడుతూ జూన్ 2ను అవతరణ దినంగా ప్రకటించటం చారి త్రక తప్పిదమన్నారు.