
సడలని ధీమా... తగ్గని వాకర్లు
కాల్పులు జరిగిన తర్వాత వాకర్లు తీవ్ర భయాందోళనకు గురైనా ఆ ప్రభావం గురువారం ఏ మాత్రం కనిపించలేదు.
కాల్పులు జరిగిన తర్వాత వాకర్లు తీవ్ర భయాందోళనకు గురైనా ఆ ప్రభావం గురువారం ఏ మాత్రం కనిపించలేదు. ఎప్పటిలాగే వాకర్లంతా వాకింగ్కు వచ్చారు. బుధవారం ఉదయం 4200 మంది వాకర్లు వాకింగ్ చేయగా గురువారం కూడా అంతే సంఖ్యలో వాకింగ్కు వచ్చారు. వీవీఐపీలు కూడా ఏ మాత్రం తగ్గకుండా వాకింగ్ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్, వైఎస్సార్సీపీ నేత ఎంవీ మైసూరారెడ్డి, లక్ష్మీపార్వతి, ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, నటుడు, రచయిత తనికెళ్ల భరణి తదితరులు ఎప్పటిలాగానే వాకింగ్లో కనిపించారు.