ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ఇంటర్ విద్యార్థిని షాలిని మృతిచెందింది
సికింద్రాబాద్: సికింద్రాబాద్ శివారులోని ఆలుగడ్డబావి వద్ద గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ఇంటర్ విద్యార్థిని షాలిని మృతిచెందింది. షాలిని ద్విచక్రవాహనంలో వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.