పంచలోహ విగ్రహాలు చోరీ చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ నగర పోలీసులు శనివారం రట్టు చేశారు.
హైదరాబాద్: పంచలోహ విగ్రహాలు చోరీ చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ నగర పోలీసులు శనివారం రట్టు చేశారు. ముఠాలోని సభ్యుల నుంచి మూడు పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు తమదైన శైలిలో వారిని విచారిస్తున్నారు. సదరు మూడు విగ్రహాలను వరంగల్ జిల్లా మొగిళ్లపల్లి నుంచి చోరీ చేసినట్లు దొంగలు వెల్లడించారని పోలీసులు తెలిపారు.