వచ్చే నాలుగు రోజులపాటు తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది.
మొగుళ్లపల్లిలో 7 సెంటీమీటర్ల వర్షం
సాక్షి, హైదరాబాద్: వచ్చే నాలుగు రోజులపాటు తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. వరంగల్ జిల్లా మొగుళ్లపల్లిలో 7 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. కరీంనగర్లో 6, మణుగూరు, బాల్కొండ, పరకాల, వెంకటాపూర్లలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. రామగుండం, పినపాక, సుల్తానాబాద్లలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.