శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 96 లక్షల 34 వేల రూపాయల విలువైన అమెరికా, సౌదీ అరేబియాకు చెందిన కరెన్సీని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
దుబాయ్కు ఈ కరెన్సీని అక్రమంగా తరలిస్తున్నట్టు అధికారులు చెప్పారు. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.