⇒ విద్యుత్ కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు..
⇒ టీఎస్పీసీసీలో నిర్ణయించిన విద్యుత్ సంస్థల యాజమాన్యాలు
⇒ 28లోగా ఔట్ సోర్సింగ్ వివరాల సమర్పణకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు 2016 డిసెంబర్ 4ను కటాఫ్ డేట్గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత నెలలో జరిగిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీ (టీఎస్పీసీసీ) సమావేశంలో తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల యాజమాన్యాలు ఈ మేరకు తీర్మానం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కటాఫ్ తేదీలోగా విద్యుత్ సంస్థల్లో నియామకం పొందిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరణకు అర్హులుగా పరిగణించనున్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న విద్యుత్ ఔట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులను దశల వారీగా క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఇటీవల హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ కటాఫ్ తేదీని విద్యుత్ సంస్థలు ఖరారు చేశాయి. త్వరలో జారీ చేయనున్న క్రమబద్ధీకరణ మార్గదర్శకాల్లో కటాఫ్ తేదీగా చేర్చనున్నారు.
28లోగా ‘ఔట్ సోర్సింగ్’ వివరాలు
విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు విద్యుత్ సంస్థల యాజమాన్యాలు కసరత్తు ప్రారంభించాయి. క్షేత్రస్థాయిలో జోన్లు, డివిజన్లు, పవర్ స్టేషన్ల వారీగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నిర్దేశించిన ఫార్మాట్లలో ఈనెల 28 లోగా సమర్పించాలని ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల యాజమాన్యాలు ఉత్తర్వులు జారీ చేశాయి. రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థల్లో సుమారు 16,900 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) విభాగాల్లో పని చేస్తున్నారని ట్రాన్స్కో ఇప్పటికే ప్రాథమికంగా నిర్థారించింది. టైపిస్టులు, కంప్యూటర్ ఆపరేటర్లు, డ్రైవర్లు తదితర కేటగిరీల్లో మరికొంత మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరందరికీ సంబంధించిన బయోడేటా, నివాస ధ్రువీకరణ, స్వీయ ధ్రువీకరణ పత్రాలు, ఔట్ సోర్సింగ్ ఒప్పందం, అనుభవం తదితర వివరాలతో నిర్దేశించిన ఫార్మాట్లలో సమాచారాన్ని స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సీనియారిటీ జాబితాలను రూపొందించనున్నారు. ఈ మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్యపై ఈనెల 28 తర్వాత స్పష్టత రానుంది.
మార్గదర్శకాలను ప్రతిపాదించిన యూనియన్లు
ట్రాన్స్కో యాజమాన్యం సూచన మేరకు ఇప్పటికే కొన్ని ట్రేడ్ యూనియన్లు స్వయంగా క్రమబద్ధీకరణ మార్గదర్శకాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదిం చాయి. విద్యార్హతలు, రిజర్వేషన్లు, వయస్సు నిబంధనలతో సంబంధం లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంద రిని క్రమబద్ధీకరించాలని దాదాపు అన్ని యూనియన్లు కోరుకున్నాయి. మరోవైపు క్రమబద్ధీకరణ మార్గదర్శకాలను మార్చి 31లోగా జారీ చేస్తామని, మార్గదర్శకాల రూపకల్పనకు కమిటీ వేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు కమిటీ ఏర్పాటు చేయలేదు. దీంతో గడువులోగా మార్గదర్శకాలు సిద్ధం అవుతాయా, లేదా అనే అంశంపై ట్రేడ్ యూనియన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
కటాఫ్ డేట్ 2016 డిసెంబర్ 4
Published Tue, Feb 21 2017 2:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement