రామోజీరావును పరామర్శించిన సీఎం కేసీఆర్‌ | cm kcr visit ramoji rao house | Sakshi
Sakshi News home page

రామోజీరావును పరామర్శించిన సీఎం కేసీఆర్‌

Jan 29 2017 2:21 AM | Updated on Aug 14 2018 11:02 AM

శనివారం రామోజీరావును ఆయన నివాసంలో పరామర్శిస్తున్న సీఎం కేసీఆర్‌. - Sakshi

శనివారం రామోజీరావును ఆయన నివాసంలో పరామర్శిస్తున్న సీఎం కేసీఆర్‌.

ఈనాడు గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ రామోజీరావును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరామర్శించారు.

సాక్షి, హైదరాబాద్‌: ఈనాడు గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ రామోజీరావును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరామర్శించారు. కొద్ది రోజుల కింద అనారోగ్యానికి గురైన రామోజీరావు ప్రైవేటు కార్పొరేటు ఆసుప త్రిలో చికిత్స పొందినట్లు తెలిసింది. ఇటీవలే కోలుకున్న రామోజీరావు బేగంపేటలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

శనివారం సాయంత్రం సీఎం కేసీఆర్‌... రామోజీరావు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్‌ వెంట ప్రముఖ వైద్యుడు ఎంవీ రావు తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement