గవర్నర్ జీ.. గృహప్రవేశాలకు రండి | CM KCR meets Governor Narasimhan | Sakshi
Sakshi News home page

గవర్నర్ జీ.. గృహప్రవేశాలకు రండి

Oct 16 2015 12:52 PM | Updated on Aug 21 2018 11:41 AM

గవర్నర్ జీ.. గృహప్రవేశాలకు రండి - Sakshi

గవర్నర్ జీ.. గృహప్రవేశాలకు రండి

గవర్నర్ నరసింహన్తో తెలంగాణ సిఎం కేసీఆర్ భేటీ అయ్యారు.

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు భేటీ అయ్యారు. కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా భావిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభానికి రావాలని గవర్నర్ను ఆహ్వానించారు.

సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీలో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పటికే స్వయంగా కేసీఆర్ పలుమార్లు ఈ కాలనీని సందర్శించారు. ఈ ఇళ్ల గృహప్రవేశాలకు రావాలని గవర్నర్ నరసింహన్ ను ఆయన ఆహ్వానించారు. దాంతోపాటు ట్యాంక్ బండ్ మీద జరిగే బతుకమ్మ ముగింపు వేడుకలకు హాజరుకావాలని కూడా ఆయనను కోరినట్లు సమాచారం.

అయితే  ఐడీహెచ్ కాలనీ ఇళ్ల ప్రారంభోత్సవం, ఏపీ రాజధాని శంకుస్ధాపన కూడా ఓకే సమయంలో జరగనున్నాయి. ఏపీ రాజధాని శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు రానున్నారు. మరి గవర్నర్ ఏ కార్యక్రమానికి హాజరు అవుతారోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement