శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభించటం సోమవారం కలకలం రేపింది.
శంషాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభించటం సోమవారం కలకలం రేపింది. దుబాయి నుంచి విమానంలో వచ్చిన కృష్ణప్రసాద్ అనే వ్యక్తిని భద్రతాసిబ్బంది తనిఖీ చేయగా 9 మిమీ బుల్లెట్ లభ్యమైంది. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కృష్ణప్రసాద్ స్వస్థలం విశాఖపట్టణం అని సమాచారం.