ఎల్బీనగర్లో ముగ్గురు వ్యక్తుల మధ్య ఘర్షణ నేపథ్యంలో కత్తులతో దాడికి తెగబడ్డారు.
దీంతో స్థానికంగా భయనక వాతావరణం నెలకొంది. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడిలో గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారి వివరాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.