అత్యవసర మరమ్మతుల నేపథ్యంలో ఈ నెల 19న ....
సిటీబ్యూరో: అత్యవసర మరమ్మతుల నేపథ్యంలో ఈ నెల 19న (శుక్రవారం) ఉదయం 6 నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు వివిధ ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ప్రకటించింది.
బోయిగూడ, రైల్ కళారంగ్, పద్మారావు నగర్, సీసీ నగర్, హమాలీబస్తీ, వెంకటాపురం, బోయిగూడ సెక్షన్, పాన్బజార్, ఓల్డ్బోయిగూడ, కుర్మబస్తీ, ఆవుల మంద, రంగ్రేజ్ బజార్, గ్యాస్ మండీ, నల్లగుట్ట సెక్షన్లకు మంచినీటి సరఫరా ఉండదని సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే సరఫరా పునరుద్ధరిస్తామని వెల్లడించారు.