నగరంలో గుర్తుతెలియని దుండగులు బీభత్సం సృష్టించారు.
హైదరాబాద్: నగరంలో గుర్తుతెలియని దుండగులు బీభత్సం సృష్టించారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సనత్ నగర్ సమీపంలోని అల్లావుద్దీన్ కోఠి బస్తీ ప్రాంతంలో దాదాపు 23 వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనతో ఆ ప్రాంత వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.