సాక్షి, హైదరాబాద్ : నగరంలోని పెద్దఅంబర్పేట వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఒక కళాశాల బస్సు బీభత్సం సృష్టించింది. ఈ సంఘటనలో ఒక బాలిక మృతిచెందడంతోపాటు పలు బైకులు ధ్వంసమయ్యాయి. సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు పెద్ద అంబర్పేటవద్ద అదుపు తప్పి ఎదురుగా వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సు రోడ్డుపక్కనున్న ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్ళింది. దాంతో రహదారి పక్కన ఉన్న మధుశాలిని(12) అనే బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ప్రమాదంలో మూడు హైక్లు ధ్వంసమయ్యాయి.
బస్సు దూసుకురావడంచూసి పాదచారులు పరుగులుతీశారు.
కాలేజి బస్సు బీభత్సం...బాలిక దుర్మరణం
Dec 20 2017 9:52 AM | Updated on Mar 21 2019 9:05 PM
Advertisement
Advertisement