చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కల్యాణి డ్యాం వద్దనున్న పోలీసు శిక్షణ కాలేజ్ లో ఎస్ఐగా పనిచేస్తున్నతులసీరామ్ బుధవారం మధ్యాహ్నాం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
చిత్తూరు జిల్లాలో ఎస్ఐ ఆత్మహత్యాయత్నం
Mar 2 2016 2:30 PM | Updated on Sep 2 2018 3:51 PM
తిరుపతి : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కల్యాణి డ్యాం వద్దనున్న పోలీసు శిక్షణ కాలేజ్ లో ఎస్ఐగా పనిచేస్తున్నతులసీరామ్ బుధవారం మధ్యాహ్నాం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే అతనిని రుయా ఆసుపత్రికి తరలించారు. కళాశాల ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక తులసీ రామ్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిస్తోంది. చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం జిల్లాలోని పుత్తూరులో ఉగ్రవాదుల ఆపరేషన్ లో తులసీరామ్ కీలక పాత్ర పోషించారు.
Advertisement
Advertisement