'రహస్యంగా ఎందుకు జారీ చేస్తున్నారు' | congress leaders slams CM chandrababu naidu | Sakshi
Sakshi News home page

'రహస్యంగా ఎందుకు జారీ చేస్తున్నారు'

Dec 12 2015 3:08 PM | Updated on Aug 18 2018 5:48 PM

ఏపీ రాజధాని వ్యవహారాల్లో చంద్రబాబు సర్కార్ పారదర్శకంగా పనిచేయడం లేదని కాంగ్రెస్ నేతలు సి.రామచంద్రయ్య, శైలజానాథ్ లు విమర్శించారు.

హైదరాబాద్: ఏపీ రాజధాని వ్యవహారాల్లో చంద్రబాబు సర్కార్ పారదర్శకంగా పనిచేయడం లేదని కాంగ్రెస్ నేతలు సి.రామచంద్రయ్య, శైలజానాథ్ లు విమర్శించారు. శనివారం వారిక్కడ మాట్లాడుతూ వందలాది జీవోలు రహస్యంగా ఎందుకు జారీ చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ జీవోలను అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల్లో సభ ముందుంచాలని నేతలు డిమాండ్ చేశారు. సింగపూర్, ఏపీ ప్రభుత్వాలకు ఒప్పందాలుంటే బయట పెట్టాలన్నారు. రాజధాని నిర్మాణానికి రూ. 27 వేల కోట్లు ఎలా సమకూరుస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement