చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ఆదివారం చింటు అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు.
చిత్తూరు: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ఆదివారం చింటు అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో తంబళ్లపల్లి వైఎస్ఆర్ సీపీ సర్పంచ్ కొండ్రెడ్డి ఇంట్లో సోదాలు జరిపారు. అయితే ఇంట్లో ఎవరులేని సమయంలో తాళాలు పగులగొట్టి మరీ పోలీసులు సోదాలు నిర్వహించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల చర్యకు నిరసనగా సర్పంచ్ కొండ్రెడ్డి.. పలు ప్రజాసంఘాలతో కలిసి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.