రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి | 1 died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

Sep 25 2015 8:59 AM | Updated on Mar 19 2019 5:52 PM

వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ పోలీసు బృందం శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం బారిన పడింది.

రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ పోలీసు బృందం శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం బారిన పడింది. రెండు బృందాలు ఎర్రచందనం స్వాధీనం చేసుకునేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లాయి. తిరుగు ప్రయాణంలో కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ వద్ద పోలీసుల బృందం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కానిస్టేబుల్ ప్రసాద్‌నాయుడు మృతి చెందగా, ఎస్‌ఐ రాజేశ్వర్‌రెడ్డికి తీవ్ర గాయాలు అయినట్టు స్థానిక పోలీసు వర్గాలు తెలిపాయి. సంఘటనపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement