
ఆకుపచ్చ సూర్యదయం
కాగడాలు, నిప్పుమూటలతో స్టేషన్ బయటంతా వెలుగుతో నిండింది. అందరి చేతులలోను ఆయుధాలు.
కాగడాలు, నిప్పుమూటలతో స్టేషన్ బయటంతా వెలుగుతో నిండింది. అందరి చేతులలోను ఆయుధాలు. పది పదకొండు తుపాకులు–అవి స్టేషన్ వైపు గురి పెట్టి ఉన్నాయి.‘‘ప్పిప్పి... పితూరీ దండొచ్చే... సింది...!’’ పిచ్చివాడిలా అరిచాడా జవాను.కాపలాకి పడుకున్న ఆ గ్రామస్థులంతా మేల్కోవడం, పరుగు లంఘించడం ఒక్కసారే జరిగాయి. లోపలున్న వాళ్లు ఒక్క ఉదుటన బయటకొచ్చారంతామొదట అడ్డతీగల జవాను, వెంటనే మిగిలిన ఆరుగురు చేతులు ఎత్తేశారు.ఈ పది నిమిషాలలోనే ఆ డెబ్బయ్ ఎనభై మందితో ఉన్న కొండదళానికి మరో యాభయ్ అరవై మంది తోడయ్యారు.
అంతా దూసుకొచ్చారు స్టేషన్లోకి. పోలీసులని అసలు పట్టించుకోలేదు. అదే అదనుగా ఒక పక్క నుంచి అరుగు దూకేసి, ‘‘పితూరీ దండొచ్చింది. పితూరీ దండొచ్చింది.’’అని అరుచుకుంటూ గ్రామం వైపు పరుగులు తీశారు పోలీసులు. గ్రామంలో కలకలం. అంతా లేచి, ఇళ్లకు తాళాలు వేసి తలా దిక్కుకు పారిపోతున్నారు. స్టేషన్లో మొదట పడాలు లాకప్ గది తాళాన్ని తుపాకీ మడమతో ఒక్క దెబ్బకి బద్దలు కొట్టాడు. కాగడాలు, ఉప్పు మూటల వెలుగు లోపలికి వస్తుంటే, లాకప్ గది తలుపు తోసుకుని బయటకు వచ్చి, సంభ్రమంగా చూస్తూ నిలబడ్డాడు వీరయ్యదొర.‘‘బాగున్నారా వీరయ్యదొరా!’’ పలకరించాడు గంతన్న, నమస్కరిస్తూ.
‘‘నువ్వు...!?’’
‘‘గాం జోగిదొర కొడుకుని. బట్టిపనుకుల. గంతన్నlఅంటారు’’ అన్నాడు.‘‘అలాగా!’’ అంటుండగానే, లోపలికి వచ్చాడు రామరాజు.పడాలు కూడా వీరయ్యదొరకి నమస్కరించి, ‘‘వీరయ్యదొర! వారు శ్రీరామరాజుగారు. మిమ్మల్ని తీసుకుని వెళ్లడానికి వచ్చారు’’ అన్నాడు ఆనందంగా.‘‘వీరయ్యగారూ! నమస్కారం.’’ తన చేతిలో ఉన్న తుపాకీ ఆయన చేతిలో పెడుతూ అన్నాడు రామరాజు.స్టేషన్లో దాచిన ఆయుధాలు, తూటాలు చిటికెలో టేబుల్ మీదకు చేరాయి.ఎవరో టేబుల్ మీద లాంతరు దగ్గర ఒక కాగితం, అక్కడే ఉన్న కలం తీసి రామరాజు చేతికిచ్చారు. ఆయుధాల గురించి రాసి సంతకం చేశారాయన.
తరువాత వీరయ్య దగ్గరకే వచ్చాడు రామరాజు.‘‘మీరిక స్వేచ్ఛాజీవి. మీ ఉత్సాహాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మీరు మా ఉద్యమంలోకి రావచ్చు. మమ్మల్ని నడిపించవచ్చు. రండి వెళదాం.’’ అన్నాడు రామరాజు. టషన్ బయటకు వచ్చి వరుసగా నిలబడ్డారు. నల్లటి ఆకాశం వైపు గురిపెట్టి కాల్చారు. ఇరవై ఒక్క పేలుళ్లు. మూడురోజులలో మూడు స్టేషన్లలో సేకరించిన ఆయుధాలు – ఇరవై ఒకటి. క్షణం తరువాత అక్కడ ఎవరూ కనిపించలేదు. ఏం జరిగింది? గ్రామస్థులకి అదంతా కలలా ఉంది.
5
ఉదయం తొమ్మిది గంటల వేళ....విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం. మేజిస్ట్రేట్ సి.ఎ. హ్యండర్సన్ మద్రాసులో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎ.గ్రాహంకు సమాచారం పంపే హడావిడిలో ఉన్నాడు. ‘నర్సీపట్నం దగ్గర తిరుగుబాటు జరిగింది. పూర్తి వివరాలు త్వరలో పంపుతాం. ఈ తిరుగుబాటులో చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి స్టేషన్ల నుంచి ఆయుధాలు దొచుకోవడం మినహా మరే విధమైన దోపిడీ, దౌర్జన్యం జరగలేదు. తిరుగుబాటుకు ఇంతవరకు కారణాలు తెలియరాలేదు.దీని నాయకుడు శ్రీరామరాజు అడ్డతీగెల దగ్గర కొంతకాలం ఇంటర్న్ అయినట్టు తెలిసింది. ఇతడు నేపాల్ యాత్రకు అనుమతి తీసుకుని పెద్దవలస ముఠాకు వచ్చాడు. ఇక్కడనే ఎక్కువ మంది అనుచరులను సేకరించినట్టు తెలుస్తున్నది.‘ఈ తిరుగుబాటు ఆశయాల గురించి కూడా తెలియడం లేదు. ఇంటర్న్మెంట్ నుంచి రెండోసారి పారిపోయిన వీరయ్యదొరను జైలు నుంచి రక్షించడానికి కావచ్చు.
‘ఏజెన్సీ కమిషనర్ స్టీవార్ట్ నివేదిక ప్రకారం కూడా ఆయుధాల దోపిడీ మాత్రమే జరిగింది. దీనిని బట్టి కేవలం దోపిడీయే వీరి లక్ష్యం కాదని తోచుచున్నది.’ l‘‘హలో... హలో... కేడీపేట క్యాంప్.... ఓవర్’’ పిలిచాడు ఫర్బీస్.‘‘హలో..నర్సీపట్నం హెడ్క్వార్టర్స్... నర్సీపట్నం హెడ్క్వార్టర్స్.. ఓవర్....’’ అవతల నుంచి వినిపించింది.‘‘హలో... రామరాజుని నేరుగా కేడీపేటలో అప్పగించాలన్న సమాచారం కొయ్యూరు వెళ్లిందా? ఓవర్’’ అవతల నుంచి అడుగుతున్నారు.‘చేరింది. ఓవర్’’ చెప్పాడు ఫర్బీస్.‘‘స్పెషల్ కమిషనర్, జాన్ కొద్దిసేపటి క్రితమే కేడీ పేట బయలుదేరారు.’’ చెప్పారు అవతల.‘‘ఓకే ఒకే... ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం. ఓవర్.’’ ఫర్బీస్. సమయం పదకొండున్నర. ఎండ మండిపోతోంది. ఎనిమిదవ అధ్యాయం
1
చూస్తూ ఉండగానే యుద్ధవాతావరణం ఏర్పడింది మన్యం నిండా.గోచిపాతరాయుళ్లు మూడు పోలీస్ స్టేషన్లు కొట్టడమా? గ్రేట్వార్ను నడిపించిన దేశానికా ఈ పరీక్ష? ఇరవై ఒక్క తుపాకులు ఎత్తుకెళ్లింది కొండదళం. అన్నీ ‘303’ తుపాకులే. ఇప్పుడు కొండదళమూ ఆ«ధునిక పోలీసు పటాలమే. గంట గంటకు పోలీసు బలగాలతో నిండిపోతోంది నర్సీపట్నం. నార్తర్న్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ జార్జి దాడుల సంగతి తెలిసిన మరుక్షణమే ఆదేశాలిచ్చాడు, మోహరింపు గురించి.వచ్చినవాళ్లను వచ్చినట్టు కొండలలోకి తరుముతున్నారు. మూడురోజులలోనే మన్యాన్ని ఖాకీవనం చేశారు. అక్షరాలా అష్ట దిగ్బంధనమే.
నర్సీపట్నంతో పాటు, కృష్ణదేవిపేట, చింతపల్లి, లంబసింగి, అడ్డతీగల, కొయ్యూరు, కోటనందూరు, మల్కన్గిరిల దగ్గర పోలీసు శిబిరాలు వెలిశాయి. ఏజెన్సీ పోలీస్ సూపరింటెండెంట్ సాండర్స్ కొద్దిమంది విశాఖపట్నం రిజర్వు పోలీసు బలగాలను వెంటపెట్టుకుని హుటాహుటిన నర్సీపట్నం వచ్చాడు, దాడుల మరునాడే. డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ అక్కడే ఉంటాడు. హోదా తక్కువ అని ఆలోచించకుండా వెంటనే నిర్ణయాలు తీసుకోవడానికీ, ఆగమేఘాల మీద అమలు చేయడానికీ వీలుగా సాండర్సే దిగాడు.చివర్న జిల్లా కలెక్టర్ హ్యాండర్సన్, పోలీసు సూపరింటెండెంట్ మార్టిన్ మోటారు మీద బయలుదేరారు.
విశాఖపట్నం రిజర్వుదళాలు వెంటనే కృష్ణదేవిపేట వెళ్లిపోయాయి. ఇవి సాండర్స్ నాయకత్వంలో పనిచేస్తాయి.పార్వతీపురం రిజర్వు దళాలు నర్సీపట్నం మీదుగా చింతపల్లికి వెళ్లాలని ఆదేశాలు వెళ్లాయి. ఆ దళాలు రెండురోజులకి చింతపల్లి చేరుకున్నాయి. అందులో కొంత రిజర్వు దళం 28వ తేదీకల్లా లంబసింగిలో మకాం వేసింది. విశాఖ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్ల నాయకత్వంలో వచ్చిన 20 మంది రిజర్వు దళాల బృందం వారికి తోడైంది. ఈ దళాల మీద ఆధిపత్యం వహించడానికి స్కాట్ కవర్డ్ను నియమించారు.
అడ్డతీగలలో మోహరించవలసిందంటూ రాజమండ్రి రిజర్వు దళాలకి ఆదేశం వెళ్లింది. ఆగస్టు 25నే ఆ దళాలు బయలుదేరాయి. అడ్డతీగల కార్యకలాపాల బాధ్యత డాసన్ చేతికి ఇచ్చారు. అక్కడ నుంచి కొందరు రాజమండ్రి రిజర్వు దళ సభ్యులని మళ్లీ కొయ్యూరు తరిమారు.కాకినాడ రిజర్వు దళాలు వచ్చి తుని దగ్గరలోనే కోటనందూరులో సిద్ధంగా ఉండాలి.కృష్ణా రిజర్వు మల్కన్గిరి చేరుకోవాలి. పోలీసు కార్యకలాపాల వ్యవహారాలకు నర్సీపట్నాన్ని ప్రధాన కేంద్రాన్ని చేశారు.పోలీసు బలగాలను సమన్వయం చేస్తూ, తాజా అలజడిని అణచివేసే బాధ్యతలను కీనేకు అప్పగించారు. ట్రేమన్హేర్ నాయకత్వంలో ఒక దళం, 33 మంది సభ్యుల దళంతో స్కాట్ కవర్డ్ చింతపల్లి చుట్టుపక్కల గాలింపు పేరుతో అప్పుడే వీరవిహారం ఆరంభించారు.
2
‘‘ఏజెన్సీ ఉద్యమనాదంతో మార్మోగుతున్నది. సహాయ నిరాకరణోద్యమంలో అగ్రభాగాన నిలిచిన జాతీయ కాంగ్రెస్ తరఫున నాయకులు వెంటనే మన్యానికి వెళ్లడం, పరిస్థితిని గమనించడం అవసరం.’’పెద్దాపురం కాంగ్రెస్ నాయకులు వార్తాపత్రికలకీ, రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకులకీ టెలిగ్రామ్లు ఇచ్చి రెండురోజుల యింది. పెద్దలెవరో వస్తారనీ, ఏదో చెబుతారనీ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు వారు. అటు విజయనగరం మొదలు, ఇటు మద్రాసు వరకు ఆ వార్తలతోనే పత్రికలు హోరెత్తిస్తున్నాయి.
‘‘ఏజెన్సీలోని కొండగ్రామాల ప్రజలు ఏవేవో కారణాలతో తిరుగుబాటు లేవదీశారని ప్రజలు చెప్పుకుంటున్నారు. నాలుగు లేదా ఐదు పోలీసు స్టేషన్ల మీద దాడులు చేశారట. ఆయుధాలు, మందుగుండు దోచుకుని వెళ్లారట. ఈ దోపిడీలను అరికట్టడానికి కృష్ణా, గోదావరి జిల్లాల నుంచి రిజర్వు బలగాలను పంపించారట.....’’రాజమండ్రి నుంచి వెలువడుతున్న మాసపత్రిక ‘కాంగ్రెస్’లో ఆగస్టు 28న వచ్చింది వార్త. ఐదారు మాసాల క్రితమే మొదలైన ‘కాంగ్రెస్’ సైక్లోస్టయిల్ పత్రిక. మద్దూరి అన్నపూర్ణయ్య సంపాదకుడు. మరునాడే ‘ఆంధ్రపత్రిక’ ప్రచురించిన వార్త కలకలం సృష్టించింది. ఉరుములేని పిడుగు లాంటి వార్త– పెద్దాపురం విలేకరి రాసినది.
‘‘ఒక క్షత్రియ యువకుని నాయకత్వంలో వందలాదిమంది ఏజెన్సీ ప్రజలు పోలీసు స్టేషన్లను దోచుకున్నారు. చింతపల్లి, కృష్ణదేవి పేట, రాజవొమ్మంగి స్టేషన్లలో ఆయుధాలు, మందుగుండు తీసుకుపోయారు. కానీ ఆందోళనకారులు ఎవరినీ హింసించలేదు.....’’ఆగస్టు 31 సంచికలో మరో వార్త –‘‘ఆ క్షత్రియ యువకుడు పాతికేళ్లవాడు. పేరు అల్లూరి శ్రీరామరాజు. సాత్వికాహారమే తీసుకుంటాడు. అహింసను ప్రబోధిస్తాడు. అతీతశక్తులు కలిగినవాడని చెబుతారు. ఆయనను తూటాలు కూడా గాయపరచలేవని అక్కడి ప్రజల నమ్మకం. స్టేషన్లను కొల్లగొట్టే ముందు ఆ సమాచారాన్ని కోయల ద్వారా తెలియచేస్తాడు. దాడి ఏ సమయంలో చేసేదీ కూడా చెబుతాడు. రాజు ఎక్కడ ఉన్నాడని ఆ సమాచారం తెచ్చిన కోయను అడిగితే తనకు ఏమీ తెలియదని అతడు చెబుతాడు. తాను రాజాజ్ఞ పాలిస్తున్నానని మాత్రమే చెబుతాడు. వాళ్లిచ్చే నాలుగు అణాల కోసం ఈ పని చేస్తున్నానని అంటాడు.’’
‘న్యాయదీపిక’ మద్రాసు నుంచి వెలువడుతుంది. సెప్టెంబర్ 4న ‘రంప దాడులు’ పేరుతో వార్త ఇచ్చింది. ‘గోదావరి పత్రిక’, ‘హితకారిణి’ పత్రికలు కూడా మన్యం అలజడులను గురించి వార్తలు అందించాయి.విజయనగరం నుంచి వచ్చే ‘ఆర్యప్రభ’ గూడెం ఫితూరీ అని పేరు పెట్టి, కారణాలు తెలియచేసింది. ‘గూడెం డిప్యూటీ తహసీల్దార్ రోడ్డు పని మొదలుపెట్టి, అందుకోసం కొండ ప్రజలను రప్పించుకున్నాడు. కూలీ ఇవ్వలేదు. అడవిలోకి అడుగు పెట్టే అవకాశం లేని కొండ వాళ్లు ఆకలితో అలమటిస్తున్నారు. అందుకే రోడ్డు పనికి వచ్చారు. అలాంటి బక్క ప్రాణులను బాస్టియన్ హింసించడంతో ఉద్యమం మొదలైంది...’
సహాయ నిరాకరణోద్యమంలో ఎంతో హింసను చవిచూసిన మైదాన ప్రాంతాల ప్రజలకి శ్రీరామరాజు సాహసం అద్భుతం అనిపిస్తోంది. అలాంటి సమయంలోనే సెప్టెంబర్ మొదటివారంలో ఓ టెలిగ్రాం పట్టుకుని తణుకు నుంచి పెద్దాపురం వచ్చాడు బ్రహ్మజోస్యుల సీతారామయ్య అనే కాంగ్రెస్ కార్యకర్త. అది ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షులు టంగుటూరి ప్రకాశం పంతులు 30–8–1922న ఇచ్చిన టెలిగ్రాం. ‘‘పెద్దాపురం కాంగ్రెస్ వారు ఏమీ కల్పించుకొనకూడదు.
దోపిడీగాండ్రు పోలీసు స్టేషన్లను దోచుకుని తుపాకులను, తూటాలను తీసుకుని పోతుంటే కాంగ్రెస్ వారు చేయవలసిందేమిటో నాకేమీ బోధపడడం లేదు. వారి దగ్గరకు పోయి మీరిట్లా చేయరాదని నెమ్మదిగా బోధించడానికి కూడా అవకాశం లేదు. కాంగ్రెస్ వారు ఎవరూ కూడా బందిపోట్ల దగ్గరకు పోకూడదు. కాంగ్రెస్ నాయకులు రావాలని పత్రికలకు తంతి వార్తలు పంపడమే అసంగతం.’’ హతాశులయ్యారు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు.
3
‘‘నేసాలాకుంటిని దొర!’’
దాదాపు ఏడుస్తూ చెప్పాడా కొండవాడు. అంటే– ఈ మోత నా వల్ల కాదు అని. రెండు గంటల క్రితం అలాగే వేడుకున్నాడతడు. ఎవరూ పట్టించుకోలేదు. ఒక జంతువును మోతకు ఉపయోగించుకున్నట్టే. నలభయ్ ఏళ్లుంటాయి. గోచీ తప్ప ఒంటి మీద మరేమీ లేదు. తలగుడ్డ చుట్టి నెత్తి మీద పెట్టుకున్నాడు. దాని మీదే రెండు ఖాకీసంచులు కొలువై ఉన్నాయి–బరువు నలభయ్ కిలోలు పైనే. వాటితో గంటల తరబడి కొండలూ గుట్టలూ ఎక్కుతుంటే నరకం కనిపిస్తోంది.ఒక్కొక్క సంచిలో జత బూట్లు, ఒక యూనిఫారమ్, ఐదారు లీటర్లు పట్టే నీళ్ల డబ్బా, కంబళి, పది అడుగుల పొడవు, ఐదడుగుల వెడల్పు ఉన్న పాస్టిక్ గుడ్డ, డేరా నిలబెట్టడానికి ఉపయోగించే నాలుగు పెద్ద పెద్ద మేకులు ఉన్నాయి.
సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు. ఆ కొండ మీదకు వచ్చేసరికి ఆయాసం వచ్చేసింది పార్వతీపురం రిజర్వు దళానికి. అందుకే నిలబడిపోయారు. అప్పుడే తన నెత్తి మీద ఈ బరువు ఎక్కించిన ఆ రిజర్వు పోలీసు దగ్గరకు వచ్చి అన్నాడు ఆ కొండవాడు. లాగి చెంప మీద కొట్టాడు ఆ పోలీసు. ట్రేమన్హేర్, అతడికి ఏదో చెబుతున్న బాస్టియన్, మిగిలిన పోలీసులు తటాల్న అటు చూశారు. ‘‘నోరెత్తితే తొక్క తీసీగల్ను!.’’అరిచాడా పోలీసు.తల మీది బరువుతో నడుస్తున్న మిగిలిన ఆ పదిమంది కొండవాళ్లు హడలిపోయారు. ఆ రిజర్వు దళంలోని ముప్పయ్ మంది సామగ్రిని ఆ పదకొండు మందే మోస్తున్నారు– నిన్న ఉదయం నుంచి.
మొన్న, అంటే రెండో తేదీనే లోతుగెడ్డ దగ్గర ఆ పదకొండుమంది కొండవాళ్లు రిజర్వు దళం బారిన పడి మోత మోస్తున్నారు. తిండి పెడితే పెడతారు. కూలి డబ్బు మాటే లేదు. మరోచోట ఎక్కడో కొత్త వాళ్లు దొరకాలి. ఈలోగా బరువు దించితే చెంపలు పగులుతాయి. తుపాకీ మడమలు ఎముకలు విరుస్తాయి. ఆ రోజు సెప్టెంబర్ 4. పోలీసు స్టేషన్ల మీద దాడులు జరిగి అప్పుడే పదిరోజులు గడిచిపోయాయి. ఒక్కరిని కూడా పట్టుకోలేక పోయారు. అదే ట్రేమన్హేర్ను బా«ధిస్తోంది. నాలుగు రోజుల నుంచి దోబూచులాటే.
సెప్టెంబర్ 1న∙రామరాజు, ఆయన మనుషులు సిరిబలి వచ్చారు. మామిడివరం మునసబు నాలుగు కుంచాల బియ్యం, ఒక కోడి ఇచ్చాడు. ఈ సమాచారం నిజమేనని రూఢీ చేసుకుని అక్కడికి పరిగెడితే, చిన్న ఆచూకీ కూడా దొరకలేదు. సిరిబలి నుంచి ఆ మధ్యాహ్నమే జర్లి చేరింది కొండదళం. ఆ రాత్రికే కిలంకోటకు చేరుకుంది. కిలంకోట కొండరాజు బియ్యం, కోళ్లు పంపాడు. రెండో తేదీ రాత్రికి కొండదళం గంగరాజు మాడుగుల చేరిందని మళ్లీ రిజర్వు దళానికి కబురొచ్చింది.
వేకువనే తలో దారి పట్టారు రిజర్వు పోలీసులు. గూడెం మీదుగా ధారకొండ వెళ్లి అక్కడ గాలించమని కవర్ట్కి చెప్పాడు సాండర్స్. మరో దిశలో కప్పాల, ఒంజేరి, గిమిలి, లోచిలి, పాడేరు ప్రాంతాలలో గాలించిరమ్మని ట్రేమన్హేర్ని పురమాయించాడు. ట్రేమన్హోర్ వెంట ఉంటూ దారి చూపించమని బాస్టియన్ని ఆదేశించాడు సాండర్స్. కొండకంబేరు ప్రాంతంలో గాలిస్తానని చెప్పి సాండర్స్ వెళ్లిపోయాడు. పార్వతీపురం దళం రాక అందుకే. కొంత సేద తీరాక మళ్లీ నడక మొదలు పెట్టింది రిజర్వు దళం. అరమైలు నడిచాక ఒక గుబురు చాటు నుంచి హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు ఆ వ్యక్తి. పేరు కామయ్యనాయుడు. జైపూర్ నుంచి వచ్చిన సీఐడీ.
‘‘సార్! కొండదళం గంగరాజు మాడుగులలో లేదు. ఒంజేరి వచ్చింది. రామరాజుతో సహా అంతా భోజనాలు చేసి పడుకున్నారని తెలిసింది.’’ చెప్పాడు నాయుడు, హడావిడి పడుతూ. ఒక్కసారిగా కలకలం.‘‘ఒంజేరి ఒకటిన్నర మైళ్ల ఘాటీ సార్! చాలా ఏటవాలుగా ఉంటుంది. దాని పక్కనే గిమిలి. ఒంజేరి నుంచి నర్సీపట్నం 24 కిలోమీటర్లు.’’ అందుకుని ఇంగ్లిష్లో చెప్పాడు బాస్టియన్. ట్రేమన్హేర్కు అప్పగించిన ప్రాంతంలో కొండదళం జాడేది ఉండదని అనుకున్నారు. అది తప్పు అని తేలింది. ఎక్కడలేని ఆవేశంతో అరిచాడు ట్రేమన్హేర్, ‘‘మూవ్!’’∙∙lగిమిలి వైపు నుంచి ఒంజేరి ఘాటీ మీదకి చేరాయి ఆ ఐదు ఏనుగులు. వాటి మీద పెద్ద పెద్ద మూటలు. గోకిరి ఎర్రేసు, ఆరేడుగురు పిల్లలు అక్కడికి వచ్చారు, ఏమీ తెలియనట్టు.‘‘అబ్బాయిలూ! ఇదేనా, ఒంజేరి?’’ ఒరియా యాసతో అడిగాడు మొదటి ఏనుగు మీది మావటి. ‘‘ఇదే బాబయ్యా! ఎక్కణ్ణించి?’’ అమాయకంగా అడిగాడు ఎర్రేసు.‘‘జయపురం మారాజావారి ఏనుగులు.’’ చెప్పాడతడు.
‘‘ఇటెక్కడికి?’’ అడిగాడు ఎర్రేసు.
‘‘ఇక్కడికే!’’ అన్నాడు మావటి.
‘‘ఆ మూటలేంటో!’’ మళ్లీ అడిగాడు ఎర్రేసు.
‘‘నీకెందుకో!’’ పెడసరంగా అన్నాడు మావటి.
‘‘సాయం కావాలేమోనని....!’’ అన్నాడు ఎర్రేసు.
‘‘అందుకా! ఇవన్నీ బియ్యం, కంబళ్లు, ఉప్పూ, పప్పూ....’’ చెప్పాడు మావటి.
‘‘ఎవరికో!?’’ మళ్లీ అడిగాడు ఎర్రేసు.‘‘పోలీసులకి. ఇటే వస్తున్నారు’’ చెప్పాడు మావటి.
ముఖంలో ఎలాంటి మార్పూ కనపడనీయకుండా అన్నాడు ఎర్రేసు. ‘‘బాబయ్యా! అదిగో ఆ కొండవాలు కాడ చితుకులు ఏరుకుంటూ ఉంటాం. సాయం కావాలంటే ఒక్క కేకెయ్యి!’’ మాకూ ఓ ముద్ద దొరుకుతుంది కదా అన్నట్టు సైగ చేస్తూ.‘‘పోలీసులే కదా! వెసుకుంటార్లే!’’ చెప్పాడు మావటి.కొండవాలు దగ్గరగా వచ్చి తటాల్న మాయమయ్యారు ఎర్రేసు, ఆ పిల్లలు. వెంటనే అక్కడే ఉన్న రామరాజు దళంలో ప్రత్యక్ష మయ్యాడు ఎర్రేసు. కొండదళం సభ్యులంతా అటే చూస్తున్నారు– ఘాటీ మలుపులో ఉన్న పార్వతీపురం రిజర్వు పోలీసుని.కాగడాలు, నిప్పుమూటలతో స్టేషన్ బయటంతా వెలుగుతో నిండింది. అందరి చేతులలోను ఆయుధాలు. పది పదకొండు తుపాకులు–అవి స్టేషన్ వైపు గురి పెట్టి ఉన్నాయి.
‘‘ప్పిప్పి... పితూరీ దండొచ్చే... సింది...!’’ పిచ్చివాడిలా అరిచాడా జవాను.కాపలాకి పడుకున్న ఆ గ్రామస్థులంతా మేల్కోవడం, పరుగు లంఘించడం ఒక్కసారే జరిగాయి. లోపలున్న వాళ్లు ఒక్క ఉదుటన బయటకొచ్చారంతామొదట అడ్డతీగల జవాను, వెంటనే మిగిలిన ఆరుగురు చేతులు ఎత్తేశారు.ఈ పది నిమిషాలలోనే ఆ డెబ్బయ్ ఎనభై మందితో ఉన్న కొండదళానికి మరో యాభయ్ అరవై మంది తోడయ్యారు. అంతా దూసుకొచ్చారు స్టేషన్లోకి. పోలీసులని అసలు పట్టించుకోలేదు. అదే అదనుగా ఒక పక్క నుంచి అరుగు దూకేసి, ‘‘పితూరీ దండొచ్చింది. పితూరీ దండొచ్చింది.’’అని అరుచుకుంటూ గ్రామం వైపు పరుగులు తీశారు పోలీసులు. గ్రామంలో కలకలం. అంతా లేచి, ఇళ్లకు తాళాలు వేసి తలా దిక్కుకు పారిపోతున్నారు.
స్టేషన్లో మొదట పడాలు లాకప్ గది తాళాన్ని తుపాకీ మడమతో ఒక్క దెబ్బకి బద్దలు కొట్టాడు. కాగడాలు, ఉప్పు మూటల వెలుగు లోపలికి వస్తుంటే, లాకప్ గది తలుపు తోసుకుని బయటకు వచ్చి, సంభ్రమంగా చూస్తూ నిలబడ్డాడు వీరయ్యదొర.‘‘బాగున్నారా వీరయ్యదొరా!’’ పలకరించాడు గంతన్న, నమస్కరిస్తూ. ‘‘నువ్వు...!?’’‘‘గాం జోగిదొర కొడుకుని. బట్టిపనుకుల. గంతన్నlఅంటారు’’ అన్నాడు.‘‘అలాగా!’’ అంటుండగానే, లోపలికి వచ్చాడు రామరాజు.పడాలు కూడా వీరయ్యదొరకి నమస్కరించి, ‘‘వీరయ్యదొర! వారు శ్రీరామరాజుగారు. మిమ్మల్ని తీసుకుని వెళ్లడానికి వచ్చారు’’ అన్నాడు ఆనందంగా.‘‘వీరయ్యగారూ! నమస్కారం.’’ తన చేతిలో ఉన్న తుపాకీ ఆయన చేతిలో పెడుతూ అన్నాడు రామరాజు.
స్టేషన్లో దాచిన ఆయుధాలు, తూటాలు చిటికెలో టేబుల్ మీదకు చేరాయి.ఎవరో టేబుల్ మీద లాంతరు దగ్గర ఒక కాగితం, అక్కడే ఉన్న కలం తీసి రామరాజు చేతికిచ్చారు. ఆయుధాల గురించి రాసి సంతకం చేశారాయన.తరువాత వీరయ్య దగ్గరకే వచ్చాడు రామరాజు.‘‘మీరిక స్వేచ్ఛాజీవి. మీ ఉత్సాహాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మీరు మా ఉద్యమంలోకి రావచ్చు. మమ్మల్ని నడిపించవచ్చు. రండి వెళదాం.’’ అన్నాడు రామరాజు. స్టేషన్ బయటకు వచ్చి వరుసగా నిలబడ్డారు. నల్లటి ఆకాశం వైపు గురిపెట్టి కాల్చారు. ఇరవై ఒక్క పేలుళ్లు. మూడురోజులలో మూడు స్టేషన్లలో సేకరించిన ఆయుధాలు – ఇరవై ఒకటి. క్షణం తరువాత అక్కడ ఎవరూ కనిపించలేదు. ఏం జరిగింది? గ్రామస్థులకి అదంతా కలలా ఉంది.
5
ఉదయం తొమ్మిది గంటల వేళ....విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం. మేజిస్ట్రేట్ సి.ఎ. హ్యండర్సన్ మద్రాసులో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎ.గ్రాహంకు సమాచారం పంపే హడావిడిలో ఉన్నాడు.‘నర్సీపట్నం దగ్గర తిరుగుబాటు జరిగింది. పూర్తి వివరాలు త్వరలో పంపుతాం. ఈ తిరుగుబాటులో చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి స్టేషన్ల నుంచి ఆయుధాలు దొచుకోవడం మినహా మరే విధమైన దోపిడీ, దౌర్జన్యం జరగలేదు. తిరుగుబాటుకు ఇంతవరకు కారణాలు తెలియరాలేదు. దీని నాయకుడు శ్రీరామరాజు అడ్డతీగెల దగ్గర కొంతకాలం ఇంటర్న్ అయినట్టు తెలిసింది. ఇతడు నేపాల్ యాత్రకు అనుమతి తీసుకుని పెద్దవలస ముఠాకు వచ్చాడు. ఇక్కడనే ఎక్కువ మంది అనుచరులను సేకరించినట్టు తెలుస్తున్నది.
‘ఈ తిరుగుబాటు ఆశయాల గురించి కూడా తెలియడం లేదు. ఇంటర్న్మెంట్ నుంచి రెండోసారి పారిపోయిన వీరయ్యదొరను జైలు నుంచి రక్షించడానికి కావచ్చు.‘ఏజెన్సీ కమిషనర్ స్టీవార్ట్ నివేదిక ప్రకారం కూడా ఆయుధాల దోపిడీ మాత్రమే జరిగింది. దీనిని బట్టి కేవలం దోపిడీయే వీరి లక్ష్యం కాదని తోచుచున్నది.’∙∙l‘‘హలో... హలో... కేడీపేట క్యాంప్.... ఓవర్’’ పిలిచాడు ఫర్బీస్.‘‘హలో..నర్సీపట్నం హెడ్క్వార్టర్స్... నర్సీపట్నం హెడ్క్వార్టర్స్.. ఓవర్....’’ అవతల నుంచి వినిపించింది.‘‘హలో... రామరాజుని నేరుగా కేడీపేటలో అప్పగించాలన్న సమాచారం కొయ్యూరు వెళ్లిందా? ఓవర్’’ అవతల నుంచి అడుగుతున్నారు.‘‘చేరింది. ఓవర్’’ చెప్పాడు ఫర్బీస్.‘‘స్పెషల్ కమిషనర్, జాన్ కొద్దిసేపటి క్రితమే కేడీ పేట బయలుదేరారు.’’ చెప్పారు అవతల.‘‘ఓకే ఒకే... ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం. ఓవర్.’’ ఫర్బీస్. సమయం పదకొండున్నర. ఎండ మండిపోతోంది. ఎనిమిదవ అధ్యాయం
1
చూస్తూ ఉండగానే యుద్ధవాతావరణం ఏర్పడింది మన్యం నిండా.గోచిపాతరాయుళ్లు మూడు పోలీస్ స్టేషన్లు కొట్టడమా? గ్రేట్వార్ను నడిపించిన దేశానికా ఈ పరీక్ష? ఇరవై ఒక్క తుపాకులు ఎత్తుకెళ్లింది కొండదళం. అన్నీ ‘303’ తుపాకులే. ఇప్పుడు కొండదళమూ ఆధునిక పోలీసు పటాలమే. గంట గంటకు పోలీసు బలగాలతో నిండిపోతోంది నర్సీపట్నం. నార్తర్న్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ జార్జి దాడుల సంగతి తెలిసిన మరుక్షణమే ఆదేశాలిచ్చాడు, మోహరింపు గురించి.వచ్చినవాళ్లను వచ్చినట్టు కొండలలోకి తరుముతున్నారు.
మూడురోజులలోనే మన్యాన్ని ఖాకీవనం చేశారు. అక్షరాలా అష్ట దిగ్బంధనమే. నర్సీపట్నంతో పాటు, కృష్ణదేవిపేట, చింతపల్లి, లంబసింగి, అడ్డతీగల, కొయ్యూరు, కోటనందూరు, మల్కన్గిరిల దగ్గర పోలీసు శిబిరాలు వెలిశాయి. ఏజెన్సీ పోలీస్ సూపరింటెండెంట్ సాండర్స్ కొద్దిమంది విశాఖపట్నం రిజర్వు పోలీసు బలగాలను వెంటపెట్టుకుని హుటాహుటిన నర్సీపట్నం వచ్చాడు, దాడుల మరునాడే. డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ అక్కడే ఉంటాడు. హోదా తక్కువ అని ఆలోచించకుండా వెంటనే నిర్ణయాలు తీసుకోవడానికీ, ఆగమేఘాల మీద అమలు చేయడానికీ వీలుగా సాండర్సే దిగాడు. చివర్న జిల్లా కలెక్టర్ హ్యాండర్సన్, పోలీసు సూపరింటెండెంట్ మార్టిన్ మోటారు మీద బయలుదేరారు. విశాఖపట్నం రిజర్వుదళాలు వెంటనే కృష్ణదేవిపేట వెళ్లిపోయాయి. ఇవి సాండర్స్ నాయకత్వంలో పనిచేస్తాయి.పార్వతీపురం రిజర్వు దళాలు నర్సీపట్నం మీదుగా చింతపల్లికి వెళ్లాలని ఆదేశాలు వెళ్లాయి. ఆ దళాలు రెండురోజులకి చింతపల్లి చేరుకున్నాయి. అందులో కొంత రిజర్వు దళం 28వ తేదీకల్లా లంబసింగిలో మకాం వేసింది.
విశాఖ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్ల నాయకత్వంలో వచ్చిన 20 మంది రిజర్వు దళాల బృందం వారికి తోడైంది. ఈ దళాల మీద ఆధిపత్యం వహించడానికి స్కాట్ కవర్డ్ను నియమించారు. అడ్డతీగలలో మోహరించవలసిందంటూ రాజమండ్రి రిజర్వు దళాలకి ఆదేశం వెళ్లింది. ఆగస్టు 25నే ఆ దళాలు బయలుదేరాయి. అడ్డతీగల కార్యకలాపాల బాధ్యత డాసన్ చేతికి ఇచ్చారు. అక్కడ నుంచి కొందరు రాజమండ్రి రిజర్వు దళ సభ్యులని మళ్లీ కొయ్యూరు తరిమారు.కాకినాడ రిజర్వు దళాలు వచ్చి తుని దగ్గరలోనే కోటనందూరులో సిద్ధంగా ఉండాలి.కృష్ణా రిజర్వు మల్కన్గిరి చేరుకోవాలి. పోలీసు కార్యకలాపాల వ్యవహారాలకు నర్సీపట్నాన్ని ప్రధాన కేంద్రాన్ని చేశారు.పోలీసు బలగాలను సమన్వయం చేస్తూ, తాజా అలజడిని అణచివేసే బాధ్యతలను కీనేకు అప్పగించారు. ట్రేమన్హేర్ నాయకత్వంలో ఒక దళం, 33 మంది సభ్యుల దళంతో స్కాట్ కవర్డ్ చింతపల్లి చుట్టుపక్కల గాలింపు పేరుతో అప్పుడే వీరవిహారం ఆరంభించారు.
2
‘‘ఏజెన్సీ ఉద్యమనాదంతో మార్మోగుతున్నది. సహాయ నిరాకరణోద్యమంలో అగ్రభాగాన నిలిచిన జాతీయ కాంగ్రెస్ తరఫున నాయకులు వెంటనే మన్యానికి వెళ్లడం, పరిస్థితిని గమనించడం అవసరం.’’పెద్దాపురం కాంగ్రెస్ నాయకులు వార్తాపత్రికలకీ, రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకులకీ టెలిగ్రామ్లు ఇచ్చి రెండురోజుల యింది. పెద్దలెవరో వస్తారనీ, ఏదో చెబుతారనీ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు వారు. అటు విజయనగరం మొదలు, ఇటు మద్రాసు వరకు ఆ వార్తలతోనే పత్రికలు హోరెత్తిస్తున్నాయి. ‘‘ఏజెన్సీలోని కొండగ్రామాల ప్రజలు ఏవేవో కారణాలతో తిరుగుబాటు లేవదీశారని ప్రజలు చెప్పుకుంటున్నారు. నాలుగు లేదా ఐదు పోలీసు స్టేషన్ల మీద దాడులు చేశారట.
ఆయుధాలు, మందుగుండు దోచుకుని వెళ్లారట. ఈ దోపిడీలను అరికట్టడానికి కృష్ణా, గోదావరి జిల్లాల నుంచి రిజర్వు బలగాలను పంపించారట.....’’రాజమండ్రి నుంచి వెలువడుతున్న మాసపత్రిక ‘కాంగ్రెస్’లో ఆగస్టు 28న వచ్చింది వార్త. ఐదారు మాసాల క్రితమే మొదలైన ‘కాంగ్రెస్’ సైక్లోస్టయిల్ పత్రిక. మద్దూరి అన్నపూర్ణయ్య సంపాదకుడు. మరునాడే ‘ఆంధ్రపత్రిక’ ప్రచురించిన వార్త కలకలం సృష్టించింది. ఉరుములేని పిడుగు లాంటి వార్త– పెద్దాపురం విలేకరి రాసినది.‘‘ఒక క్షత్రియ యువకుని నాయకత్వంలో వందలాదిమంది ఏజెన్సీ ప్రజలు పోలీసు స్టేషన్లను దోచుకున్నారు. చింతపల్లి, కృష్ణదేవి పేట, రాజవొమ్మంగి స్టేషన్లలో ఆయుధాలు, మందుగుండు తీసుకుపోయారు. కానీ ఆందోళనకారులు ఎవరినీ హింసించలేదు.....’’
ఆగస్టు 31 సంచికలో మరో వార్త –‘‘ఆ క్షత్రియ యువకుడు పాతికేళ్లవాడు. పేరు అల్లూరి శ్రీరామరాజు. సాత్వికాహారమే తీసుకుంటాడు. అహింసను ప్రబోధిస్తాడు. అతీతశక్తులు కలిగినవాడని చెబుతారు. ఆయనను తూటాలు కూడా గాయపరచలేవని అక్కడి ప్రజల నమ్మకం. స్టేషన్లను కొల్లగొట్టే ముందు ఆ సమాచారాన్ని కోయల ద్వారా తెలియచేస్తాడు. దాడి ఏ సమయంలో చేసేదీ కూడా చెబుతాడు. రాజు ఎక్కడ ఉన్నాడని ఆ సమాచారం తెచ్చిన కోయను అడిగితే తనకు ఏమీ తెలియదని అతడు చెబుతాడు. తాను రాజాజ్ఞ పాలిస్తున్నానని మాత్రమే చెబుతాడు. వాళ్లిచ్చే నాలుగు అణాల కోసం ఈ పని చేస్తున్నానని అంటాడు.’’
‘న్యాయదీపిక’ మద్రాసు నుంచి వెలువడుతుంది. సెప్టెంబర్ 4న ‘రంప దాడులు’ పేరుతో వార్త ఇచ్చింది.
‘గోదావరి పత్రిక’, ‘హితకారిణి’ పత్రికలు కూడా మన్యం అలజడులను గురించి వార్తలు అందించాయి.విజయనగరం నుంచి వచ్చే ‘ఆర్యప్రభ’ గూడెం ఫితూరీ అని పేరు పెట్టి, కారణాలు తెలియచేసింది. ‘గూడెం డిప్యూటీ తహసీల్దార్ రోడ్డు పని మొదలుపెట్టి, అందుకోసం కొండ ప్రజలను రప్పించుకున్నాడు. కూలీ ఇవ్వలేదు. అడవిలోకి అడుగు పెట్టే అవకాశం లేని కొండ వాళ్లు ఆకలితో అలమటిస్తున్నారు. అందుకే రోడ్డు పనికి వచ్చారు. అలాంటి బక్క ప్రాణులను బాస్టియన్ హింసించడంతో ఉద్యమం మొదలైంది...’సహాయ నిరాకరణోద్యమంలో ఎంతో హింసను చవిచూసిన మైదాన ప్రాంతాల ప్రజలకి శ్రీరామరాజు సాహసం అద్భుతం అనిపిస్తోంది.
అలాంటి సమయంలోనే సెప్టెంబర్ మొదటివారంలో ఓ టెలిగ్రాం పట్టుకుని తణుకు నుంచి పెద్దాపురం వచ్చాడు బ్రహ్మజోస్యుల సీతారామయ్య అనే కాంగ్రెస్ కార్యకర్త. అది ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షులు టంగుటూరి ప్రకాశం పంతులు 30–8–1922న ఇచ్చిన టెలిగ్రాం. ‘‘పెద్దాపురం కాంగ్రెస్ వారు ఏమీ కల్పించుకొనకూడదు. దోపిడీగాండ్రు పోలీసు స్టేషన్లను దోచుకుని తుపాకులను, తూటాలను తీసుకుని పోతుంటే కాంగ్రెస్ వారు చేయవలసిందేమిటో నాకేమీ బోధపడడం లేదు. వారి దగ్గరకు పోయి మీరిట్లా చేయరాదని నెమ్మదిగా బోధించడానికి కూడా అవకాశం లేదు. కాంగ్రెస్ వారు ఎవరూ కూడా బందిపోట్ల దగ్గరకు పోకూడదు. కాంగ్రెస్ నాయకులు రావాలని పత్రికలకు తంతి వార్తలు పంపడమే అసంగతం.’’ హతాశులయ్యారు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు.
3
‘‘నేసాలాకుంటిని దొర!’’దాదాపు ఏడుస్తూ చెప్పాడా కొండవాడు. అంటే– ఈ మోత నా వల్ల కాదు అని. రెండు గంటల క్రితం అలాగే వేడుకున్నాడతడు. ఎవరూ పట్టించుకోలేదు. ఒక జంతువును మోతకు ఉపయోగించుకున్నట్టే. నలభయ్ ఏళ్లుంటాయి. గోచీ తప్ప ఒంటి మీద మరేమీ లేదు. తలగుడ్డ చుట్టి నెత్తి మీద పెట్టుకున్నాడు. దాని మీదే రెండు ఖాకీసంచులు కొలువై ఉన్నాయి–బరువు నలభయ్ కిలోలు పైనే. వాటితో గంటల తరబడి కొండలూ గుట్టలూ ఎక్కుతుంటే నరకం కనిపిస్తోంది.ఒక్కొక్క సంచిలో జత బూట్లు, ఒక యూనిఫారమ్, ఐదారు లీటర్లు పట్టే నీళ్ల డబ్బా, కంబ, పది అడుగుల పొడవు, ఐదడుగుల వెడల్పు ఉన్న పాస్టిక్ గుడ్డ, డేరా నిలబెట్టడానికి ఉపయోగించే నాలుగు పెద్ద పెద్ద మేకులు ఉన్నాయి. సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు. ఆ కొండ మీదకు వచ్చేసరికి ఆయాసం వచ్చేసింది పార్వతీపురం రిజర్వు దళానికి. అందుకే నిలబడిపోయారు. అప్పుడే తన నెత్తి మీద ఈ బరువు ఎక్కించిన ఆ రిజర్వు పోలీసు దగ్గరకు వచ్చి అన్నాడు ఆ కొండవాడు.
లాగి చెంప మీద కొట్టాడు ఆ పోలీసు. ట్రేమన్హేర్, అతడికి ఏదో చెబుతున్న బాస్టియన్, మిగిలిన పోలీసులు తటాల్న అటు చూశారు. ‘‘నోరెత్తితే తొక్క తీసీగల్ను!.’’అరిచాడా పోలీసు.తల మీది బరువుతో నడుస్తున్న మిగిలిన ఆ పదిమంది కొండవాళ్లు హడలిపోయారు. ఆ రిజర్వు దళంలోని ముప్పయ్ మంది సామగ్రిని ఆ పదకొండు మందే మోస్తున్నారు– నిన్న ఉదయం నుంచి.మొన్న, అంటే రెండో తేదీనే లోతుగెడ్డ దగ్గర ఆ పదకొండుమంది కొండవాళ్లు రిజర్వు దళం బారిన పడి మోత మోస్తున్నారు. తిండి పెడితే పెడతారు. కూలి డబ్బు మాటే లేదు. మరోచోట ఎక్కడో కొత్త వాళ్లు దొరకాలి. ఈలోగా బరువు దించితే చెంపలు పగులుతాయి. తుపాకీ మడమలు ఎముకలు విరుస్తాయి. ఆ రోజు సెప్టెంబర్ 4. పోలీసు స్టేషన్ల మీద దాడులు జరిగి అప్పుడే పదిరోజులు గడిచిపోయాయి. ఒక్కరిని కూడా పట్టుకోలేక పోయారు. అదే ట్రేమన్హేర్ను బా«ధిస్తోంది.
నాలుగు రోజుల నుంచి దోబూచులాటే. సెప్టెంబర్ 1న∙రామరాజు, ఆయన మనుషులు సిరిబలి వచ్చారు. మామిడివరం మునసబు నాలుగు కుంచాల బియ్యం, ఒక కోడి ఇచ్చాడు. ఈ సమాచారం నిజమేనని రూఢీ చేసుకుని అక్కడికి పరిగెడితే, చిన్న ఆచూకీ కూడా దొరకలేదు. సిరిబలి నుంచి ఆ మధ్యాహ్నమే జర్లి చేరింది కొండదళం. ఆ రాత్రికే కిలంకోటకు చేరుకుంది. కిలంకోట కొండరాజు బియ్యం, కోళ్లు పంపాడు. రెండో తేదీ రాత్రికి కొండదళం గంగరాజు మాడుగుల చేరిందని మళ్లీ రిజర్వు దళానికి కబురొచ్చింది. వేకువనే తలో దారి పట్టారు రిజర్వు పోలీసులు. గూడెం మీదుగా ధారకొండ వెళ్లి అక్కడ గాలించమని కవర్ట్కి చెప్పాడు సాండర్స్. మరో దిశలో కప్పాల, ఒంజేరి, గిమిలి, లోచిలి, పాడేరు ప్రాంతాలలో గాలించిరమ్మని ట్రేమన్హేర్ని పురమాయించాడు. ట్రేమన్హోర్ వెంట ఉంటూ దారి చూపించమని బాస్టియన్ని ఆదేశించాడు సాండర్స్.
కొండకంబేరు ప్రాంతంలో గాలిస్తానని చెప్పి సాండర్స్ వెళ్లిపోయాడు. పార్వతీపురం దళం రాక అందుకే. కొంత సేద తీరాక మళ్లీ నడక మొదలు పెట్టింది రిజర్వు దళం. అరమైలు నడిచాక ఒక గుబురు చాటు నుంచి హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు ఆ వ్యక్తి. పేరు కామయ్యనాయుడు. జైపూర్ నుంచి వచ్చిన సీఐడీ.‘‘సార్! కొండదళం గంగరాజు మాడుగులలో లేదు. ఒంజేరి వచ్చింది. రామరాజుతో సహా అంతా భోజనాలు చేసి పడుకున్నారని తెలిసింది.’’ చెప్పాడు నాయుడు, హడావిడి పడుతూ. ఒక్కసారిగా కలకలం.‘‘ఒంజేరి ఒకటిన్నర మైళ్ల ఘాటీ సార్! చాలా ఏటవాలుగా ఉంటుంది. దాని పక్కనే గిమిలి. ఒంజేరి నుంచి నర్సీపట్నం 24 కిలోమీటర్లు.’’ అందుకుని ఇంగ్లిష్లో చెప్పాడు బాస్టియన్. ట్రేమన్హేర్కు అప్పగించిన ప్రాంతంలో కొండదళం జాడేది ఉండదని అనుకున్నారు. అది తప్పు అని తేలింది. ఎక్కడలేని ఆవేశంతో అరిచాడు ట్రేమన్హేర్, ‘‘మూవ్!’’
∙∙l
గిమిలి వైపు నుంచి ఒంజేరి ఘాటీ మీదకి చేరాయి ఆ ఐదు ఏనుగులు. వాటి మీద పెద్ద పెద్ద మూటలు. గోకిరి ఎర్రేసు, ఆరేడుగురు పిల్లలు అక్కడికి వచ్చారు, ఏమీ తెలియనట్టు.‘‘అబ్బాయిలూ! ఇదేనా, ఒంజేరి?’’ ఒరియా యాసతో అడిగాడు మొదటి ఏనుగు మీది మావటి.‘‘ఇదే బాబయ్యా! ఎక్కణ్ణించి?’’ అమాయకంగా అడిగాడు ఎర్రేసు. ‘‘జయపురం మారాజావారి ఏనుగులు.’’ చెప్పాడతడు.
‘‘ఇటెక్కడికి?’’ అడిగాడు ఎర్రేసు.
‘‘ఇక్కడికే!’’ అన్నాడు మావటి.
‘‘ఆ మూటలేంటో!’’ మళ్లీ అడిగాడు ఎర్రేసు.
‘‘నీకెందుకో!’’ పెడసరంగా అన్నాడు మావటి.
‘‘సాయం కావాలేమోనని....!’’ అన్నాడు ఎర్రేసు.
‘‘అందుకా! ఇవన్నీ బియ్యం, కంబళ్లు, ఉప్పూ, పప్పూ....’’ చెప్పాడు మావటి.
‘‘ఎవరికో!?’’ మళ్లీ అడిగాడు ఎర్రేసు.
‘‘పోలీసులకి. ఇటే వస్తున్నారు’’ చెప్పాడు మావటి.ముఖంలో ఎలాంటి మార్పూ కనపడనీయకుండా అన్నాడు ఎర్రేసు. ‘‘బాబయ్యా! అదిగో ఆ కొండవాలు కాడ చితుకులు ఏరుకుంటూ ఉంటాం. సాయం కావాలంటే ఒక్క కేకెయ్యి!’’ మాకూ ఓ ముద్ద దొరుకుతుంది కదా అన్నట్టు సైగ చేస్తూ.‘‘పోలీసులే కదా! మోసుకుంటార్లే!’’ చెప్పాడు మావటి. కొండవాలు దగ్గరగా వచ్చి తటాల్న మాయమయ్యారు ఎర్రేసు, ఆ పిల్లలు. వెంటనే అక్కడే ఉన్న రామరాజు దళంలో ప్రత్యక్ష మయ్యాడు ఎర్రేసు. కొండదళం సభ్యులంతా అటే చూస్తున్నారు– ఘాటీ మలుపులో ఉన్న పార్వతీపురం రిజర్వు పోలీసుని.