ఇల్లే బ్యూటీ క్లినిక్‌ | Sakshi
Sakshi News home page

ఇల్లే బ్యూటీ క్లినిక్‌

Published Fri, Aug 18 2017 12:05 AM

ఇల్లే బ్యూటీ క్లినిక్‌

బ్యూటిప్స్‌

►మెటిమలు, నల్లమచ్చలు పోవాలంటే... ఒక స్పూను నిమ్మరసంలో అంతే మోతాదులో తేనె కలిపి ముఖానికి రాయాలి. పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. పొడి చర్మం అయితే నిమ్మరసం బదులు కీరదోస రసం కలుపుకోవచ్చు.

►చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంటే... రాత్రి పడుకునే ముందు స్వచ్ఛమైన నెయ్యిని ముఖానికి రాయాలి. కోడిగుడ్డులోని పచ్చసొనను కూడా రాయవచ్చు. ఎగ్‌ ప్యాక్‌ ఆరిన తరవాత గోరువెచ్చటి నీటితో కడిగి ముఖానికి పన్నీరు అద్దాలి.

► మోచేతులు, మెడ, బాహుమూలల్లో నలుపు వదలాలంటే నిమ్మరసం లేదా కీరదోస రసం రాయాలి. కీరదోస ముక్కతో మసాజ్‌ చేసినట్లు రుద్దినా ఫలితం ఉంటుంది. సున్నితమైన చర్మానికి నిమ్మరసం రాస్తే మంటపుడుతుంది. కాబట్టి ముందుగా కొద్దిగా రాసి పరీక్షించుకోవాలి. నిమ్మరసం పడకపోతే కీరదోస వాడడమే మంచిది.

►వాతావరణంలో కాలుష్యం చర్మం మీద తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి బయటకు వెళ్లి వచ్చిన వెంటనే సబ్బుతో ముఖం కడుక్కుని తుడిచిన తర్వాత పన్నీటిని అద్దాలి. దూదిని పన్నీటిలో ముంచి అద్దితే, పన్నీరు ముఖమంతా సమంగా పడుతుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement