పాదాల చర్మం మృదువుగా..! | Foot skin soft ..! | Sakshi
Sakshi News home page

పాదాల చర్మం మృదువుగా..!

Jun 16 2016 11:00 PM | Updated on Oct 1 2018 5:41 PM

పాదాల చర్మం మృదువుగా..! - Sakshi

పాదాల చర్మం మృదువుగా..!

పాదాల పగుళ్లు పెద్ద సమస్యగా బాధిస్తుంటుంది. పాదాల అందాన్ని దెబ్బతీయడమే కాదు,

బ్యూటిప్స్
 

పాదాల పగుళ్లు పెద్ద సమస్యగా బాధిస్తుంటుంది. పాదాల అందాన్ని దెబ్బతీయడమే కాదు, నొప్పినీ తెచ్చే సమస్యలకు విరుగుడుగా!పావు కప్పు వెనిగర్, అరకప్పు వెచ్చని నీళ్లలో కలపాలి. ఆ నీళ్ళను పాదాలకు, మడమలకు రాయాలి. మిగిలిన నీళ్లను వెడల్పాటి టబ్‌లో పోసి అందులో పాదాలను ఉంచాలి. 10-15 నిమిషాల తర్వాత తడి క్లాత్‌తో అదిమిపట్టి తుడవాలి. మృతకణాలు తొలగిపోవడమే కాకుండా పాదాలకు పట్టిన బాక్టీరియా కూడా నశిస్తుంది. తర్వాత మంచి నీళ్లతో శుభ్రపరుచుకొని, పొడి క్లాత్‌తో తుడిచి బాడీ లోషన్ రాయాలి. రెండు-మూడు రోజులకు ఒకసారి ఈ విధంగా చేస్తుంటే పగుళ్లు తగ్గుతాయి. పాదాల చర్మం మృదువుగా అవుతుంది.

     
మరిగించిన నీళ్లలో నిమ్మరసం, రాతిఉప్పు కలపాలి. ఈ నీళ్లుగోరువెచ్చగా అయ్యాక అందులో పది నిమిషాల సేపు పాదాలను ఉంచితే ఫంగస్ నశించడమే కాకుండా దుర్వాసనా తగ్గుతుంది.రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసానికి టేబుల్ స్పూన్, పెట్రోలియమ్ జెల్లీ కలిపి శుభ్రం చేసుకున్న పాదాలకు రాయాలి. తర్వాత సాక్స్‌లు వేసుకోవాలి. రోజూ రాత్రిపూట ఈ జాగ్రత్త తీసుకుంటే నిమ్మరసం మృతకణాలను తొలగిస్తుంది. పెట్రోలియమ్ జెల్లీ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

     
టేబుల్ స్పూన్ బియ్యప్పిండిలో రెండు టేబుల్ స్పూన్ల తేనె, టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంతో పాదాలను, మడమలను బాగా రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి.  రాత్రి పడుకునే ముందు పాదాలకు నువ్వుల నూనె రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement