తీరికలేని పనులు ఎన్ని ఉన్నా పిల్లలతో తల్లిదండ్రులు రోజులో కొంత క్వాలిటీ టైమ్ గడపాలని నిపుణులు చెబుతుంటారు. పిల్లలు చాలాసార్లు చిరాకు పెట్టిస్తుంటారని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో వారిని తిట్టి చెప్పడానికి బదులు తల్లిదండ్రులుగా మొదట పిల్లల ప్రవర్తనకు గల కారణాన్ని గుర్తించాలి. పిల్లలు కోరుకునేది తమ పట్ల పెద్దలు కొంత శ్రద్ధ చూపడాన్నే. అది కరువైనప్పుడు పిల్లలు నిరాశకు లోనై తమ ప్రతికూల వైఖరి ద్వారా కోపాన్ని వ్యక్తం చేస్తారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపాలని పెద్దలు, నిపుణులు పదే పదే చెబుతుంటారు. మీకు ఎన్ని పనులున్నప్పటికీ పిల్లలతో రోజులో కనీసం 30 నిమిషాలు కేటాయించడం వల్ల వారి నుంచి మంచి ఫలితాలను రాబట్టవచ్చు అంటున్నారు మానసిక నిపుణులు. పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి
తల్లిదండ్రులు ఎంచుకోదగిన విషయాలు ఇవి...
1. రోజులో పిల్లలతో గడపడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించండి. రాత్రి భోజనానికి ముందు లేదా నిద్రపోయే సమయంలో మీ షెడ్యూల్ను వారికోసం కేటాయించవచ్చు. ఈ సమయంలో పిల్లలతో కలిసి పుస్తక పఠనం.. వంటి ఆసక్తి కలిగించే పనుల్లో మీరూ పాల్గొనండి.
2. ఏదైనా సరే మీరు పిల్లలతో గడిపే సమయం ప్రత్యేకంగా ఉండాలి. పిల్లలతో కలిసి ఒకే గదిలో కబుర్లు చెబుతూ ఉండటం కావచ్చు లేదా బయట ఏదైన ఫంక్షన్కు వారితో కలిసి హాజరు కావచ్చు. మీరు మీ బిడ్డతో గడిపే ఆ 30 నిమిషాల్లో వారి దృష్టి కేంద్రంగా మీరు ఉండాలి.
3. మీ బిడ్డకు కూడా సమయం కేటాయించడం విషయంలో ఒక స్పష్టత ఇవ్వండి. మీ పిల్లల కోసం ఈ సమయాన్ని వినియోగిస్తున్నామని తెలియజేయండి.
4. ఎంచుకున్న క్వాలిటీ సమయంలో పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పమనండి. దానికి మీరు ఓకే అనేస్తే పిల్లలు తమ మాటకు పెద్దలు విలువ ఇస్తున్నారని గమనిస్తారు. అంతేకాదు తాము చెప్పాలనుకున్న సృజనాత్మక విషయాల్లో ఆసక్తిని చూపుతారు.
5. పిల్లలకోసం కేటాయించిన సమయంలో ఇతర సమస్యలపై దృష్టి పెట్టకండి. మీరు పిల్లలతో కూర్చున్నప్పుడు మీ స్వంత పనులు లేదా వృత్తిపరమైన కట్టుబాట్లు ఇతర విధుల గురించి మాట్లాడకుండా ఉండటం మంచిది.
ఎంత సమయం కేటాయిస్తున్నారు?
Published Sat, Jan 11 2020 3:00 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఈవీఎంల భద్రతపై సుప్రియా సూలే సంచలన ట్వీట్
ఈ పిల్లాడు.. టీమిండియా నయా సూపర్స్టార్? గుర్తుపట్టారా?
వెల్లడైన సీబీఎస్ఈ ఫలితాలు: విద్యార్థులకు మోదీ సందేశం
గురుద్వారా సేవా కార్యక్రమంలో మోదీ! ఏంటీ లంగర్ .?
సదుపాయాల విషయం లో అధికారులు అప్రమత్తం అవ్వాలి
అప్పటిలోపు కొనేసుకోండి.. షేర్ మార్కెట్లపై అమిత్షా
మళ్ళీ గెలిచేది జగనే.. ఓటు హక్కు వినియోగించుకున్న తానేటి వనిత
సీఎం ఇంట్లో నాపై దాడి చేశారు: ‘ఆప్’ ఎంపీ సంచలన ఆరోపణలు
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement