వైఎస్ఆర్ సీపీలో చేరిన విజ్ఞాన్ రత్తయ్య | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీలో చేరిన విజ్ఞాన్ రత్తయ్య

Published Fri, Apr 11 2014 12:07 PM

వైఎస్ఆర్ సీపీలో చేరిన విజ్ఞాన్ రత్తయ్య - Sakshi

హైదరాబాద్ : విజ్ఞాన్ సంస్థల చైర్మన్ లావు రత్తయ్య శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో లోటస్ పాండ్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా రత్తయ్య మాట్లాడుతూ సీమాంధ్ర అభివృద్ధికి బలమైన నాయకత్వం కావాలని, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. తాను టికెట్ ఆశించి పార్టీలో చేరలేదని, వైఎస్ఆర్ సీపీ విజయానికి కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం ఉన్న టీడీపీలో సహజత్వం కోల్పోయిందని.... కాంగ్రెస్ వలసలతో ఆపార్టీ నిండిపోయిందని రత్తయ్య వ్యాఖ్యానించారు.

 

Advertisement
Advertisement